కరోనా పరిహారంలోనూ ఏపీకి మానవత్వం లేనట్లే !

కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. యాభై వేల పరిహారం ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు జాతీయ విపత్తు నిధుల నుంచి డ్రా చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాలకు ఆ యాభై వేలు ఓ ఆధారంగా ఉంటాయని అనుకున్నారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు తమ బాధ్యతగా భావించి పరిహారం పంపిణీ చేశాయి. అయితే ఏపీ, బీహార్ మాత్రం.. వాళ్లకేంటి ఇచ్చేదని లైట్ తీసుకున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను తమ ఎదుట వర్చువల్‌గా హాజరు కావాలని ఆదేశించింది. ఆ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ కూడా హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల ఐదు వేల మందికి పెండింగ్‌లో ఉన్నాయని.. వారంలో రోజుల్లో ఇచ్చేస్తామని సీఎస్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. రెండు వారాల గడువు ఇస్తే అందరికీ పంపిణీ చేసి ఆ వివరాలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. దీంతో సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.

అయితే మానవత్వం గురించి పదే పదే చెప్పే ప్రభుత్వం కేంద్రం విపత్తు నిధులను సాయం కోసం ఇవ్వాలని మంజూరు చేసినా ఎందుకు ఇవ్వడం లేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం. కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు అంత్యక్రియలకు గతంలో రూ. పదిహేను వేలు ఇస్తామన్నారు. జీవో ఇచ్చారు. కానీ ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదు. అందుకే ఏపీ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close