అక్కినేని లుక్‌కి మనవరాలి అమోదముద్ర!

నందమూరి బాలకృష్ణ కనుసన్నల్లో రూపొందుతోన్న సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కనుక ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. చాలా అంశాలపై ఆయనకు అవగాహన ఉంది. ఎందులోనూ చిన్న చిన్న పొరపాట్లు దొర్లడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఇదే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కూడా ఉంది. అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నాడు. ఈ పాత్ర విషయంలో మాత్రం సుమంత్‌ సోదరి, అక్కినేని మనవరాలు సుప్రియ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏయన్నార్‌గా సుమంత్‌ లుక్‌ కూడా ఆమె ఆమోదముద్ర వేశాక బయటకు వచ్చింది. ఈ విషయాన్ని సుమంతే స్వయంగా తెలిపాడు.

‘‘ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభం నుంచి కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌తో, దర్శకుడు క్రిష్‌తో సుప్రియ మాట్లాడుతోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ టీమ్‌కి తాతగారి పాత ఫొటోలు పంపిస్తూ, అవసరమైన విషయాలు చెబుతూ టచ్‌లో వుంది. కొంచెం ఇన్వాల్వ్‌ అవుతోంది. అందుకని, సినిమాలో నా ఫస్ట్‌లుక్‌ని తనకు పంపించా. నాకు పెద్ద క్రిటిక్‌ కూడా తనే. బాలేదంటే ముఖం మీద చెప్పేస్తుంది. లుక్‌కి సంబంధించి బిగినింగ్‌లో కొన్ని కరెక్షన్స్‌ అనుకున్నాం. కాని సుప్రియకు విడుదల చేసిన లుక్‌ పంపగానే… ‘ఏం మార్చవద్దు. ఇదే విడుదల చేయండి. మరో ఆలోచన వద్దు’ అని చెప్పింది. వెంటనే విడుదల చేశాం’’ అని తాజా ఇంటర్వ్యూలో సుమంత్‌ చెప్పాడు. అక్కినేని లుక్‌ విషయంలో ఆయన మనవరాలి ఆమోదముద్ర పడ్డాక బయటకు వచ్చిందన్న మాట!! మామూలుగా అన్నపూర్ణ స్టూడియో నిర్మించే సినిమాల పనులు, స్టూడియో నిర్మాణ వ్యవహారాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారని సుప్రియకు ఇండస్ట్రీలో మంచి పేరుంది!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close