జరిపామని చెప్పుకోవడానికే ఆ చర్చలు..!

కార్మిక సంఘాలతో చర్చలను ఆర్టీసీ యాజమాన్యం మ..మ అనిపించింది. కోర్టు ఆదేశం మేరకు.. చర్చలు జరిపామని.. ఆధారాలు చూపించుకోవడానికి చర్చలు జరిగినట్లుగా.. వ్యవహారం అంతా జరిగిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఎర్రమంజిల్‌ ఈఎన్సీ ఆఫీసుకు ఆర్టీసీ జేఏసీ నేతలలు వచ్చారు. కార్మిక సంఘాల నేతల్లో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వాసుదేవరావు, వీఎస్‌ రావులను మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. చర్చల మొత్తాన్ని వీడియో తీశారు. జేఏసీ నేతల ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయించారు. డిమాండ్లన్నింటిపై చర్చించాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఆయితే.. ప్రభుత్వ కమిటీ మాత్రం.. అంగీకరించలేదు. ఆర్థిక భారం లేని డిమాండ్లను మాత్రమే చర్చించాలన్నారు. దీనికి జేఏసీ నేతలు అంగీకిరంచలేదు. అక్కడితో చర్చలకు పుల్ స్టాప్ పడింది. జేఏసీ నేతలు బయటకు వచ్చేశారు.

శత్రుదేశాలతో కూడా ఇంత నిర్భంధంగా చర్చలు జరిగి ఉండవని.. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ.. 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామంటోందని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. మా డిమాండ్లలో కొన్ని మినహాయించాలని కోర్టు చెప్పలేదన్నారు. డిమాండ్లపై అసలు చర్చించనే జరగలేదన్నారు. మా ఫోన్లు తీసుకోవడానికే వాళ్లకు అరగంట సమయం పట్టిందని .. చరిత్రలో తొలిసారి అధికారులు చర్చలను బాయ్‌కట్‌ చేశారని మండిపడ్డారు. ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తేల్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని .. 30న సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.

సోమవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో.. చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ అనే భావన రాకుండా ఉండటానికే ప్రభుత్వం వ్యూహాత్మకగా.. తూ..తూ మంత్రంగా చర్చలు జరిపిందన్న ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి. చర్చల ప్రక్రియను రికార్డు చేసిన అధికారులు సోమవారం వాటిని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. అయితే.. సమ్మెపై నిర్ణయం తీసుకునే హక్కు హైకోర్టుకు లేదని.. కేసీఆర్ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close