టీడీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కాలేదట..!

నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్సీల పదవి కాలం పూర్తయిపోయిందని.. అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలు తమ ఎమ్మెల్సీ కాలం పూర్తి కాలేదని.. న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. రేపో మాపో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అదెలా సాధ్యమంటే.. కరోనా కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటన చేసింది. ఎన్నికల కమీషన్ పేర్కొన్న ఆ ప్రకటనలో.. రిటైర్మెంట్ కు సంబంధించిన అంశం ఉంది.

ప్రస్తుతం రిటైర్ కావాల్సిన ఎమ్మెల్సీలు ఆగస్టు11 వతేదీన రిటైర్ అవుతారన్న అర్థంలో ఆ నోటిఫికేషన్ ఉందని రిటైరైన టీడీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. ఆ నోటిఫికేషన్ డాక్యుమెంట్లతో సహా ప్రస్తుతం వారు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోతే కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నలుగురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ లీగల్ సెల్ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. సాధారణంగా.. ఖాళీఅయ్యే ఎమ్మెల్సీ సీట్లను.. .వెంటనే భర్తీ చేస్తారు. ఖాళీగా ఉండటానికి అవకాశం లేదు. శాసనమండలి శాశ్వత సభ.

అదే సమయంలో ఎన్నికల విషయంలో రాజ్యాంగపరమైన హక్కులు ఉన్న ఎన్నికల కమిషన్ కూడా ఎమ్మెల్సీ రిటైర్మెంట్ విషయంలో… కొన్ని సూచనలు చేసింది. అవి పాటించాల్సి ఉంది. సాంకేతికంగా అయితే ఇప్పటికే.. వారి పదవీ కాలం ముగిసింది. కానీ ఎన్నికల సంఘం తమ రిటైర్మెంట్ కు ఇంకా గడువు ఇచ్చిందంటూ వారు న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు. ఎన్నికల సంఘం దృష్టికిఈ విషయం వెళ్లి.. పొరపాటు జరిగిందని సవరించుకుంటే.. ఈ టీడీపీ ఎమ్మెల్సీల ఆశలు గల్లంతయినట్లే. కాదు మళ్లీ ఎన్నికలు జరిగే వరకూ.. వాళ్ల పదవి ఉంటుందటే… కాలం కలసి వచ్చినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close