అన్నీ కేసీఆర్‌ చేసేవే చేస్తే ఇక బీజేపీకి ఓటెందుకు చీఫ్ !?

తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ … కేసీఆర్ పథకాలన్నీ కొనసాగిస్తామని.. చివరికి ధరణి పోర్టల్ ను కూడా కొనసాగిస్తామని ప్రకటించేశారు. ఆయన ప్రకటన బీఆర్ఎస్ నేతల్ని ఫక్కున నవ్వేలా చేసింది. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఇప్పటి వరకూ బండి సంజయ్ చెబుతూ వచ్చారు. కానీ హఠాత్తుగా రద్దు చేయబోమని కొనసాగిస్తామని చెబుతున్నారు. అంతేనా.. మళ్లీ కేసీఆర్ పథకాల ప్రస్తావన తీసుకు వచ్చారు. వాటన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. వాటి కోసమే అయితే.. కేసీఆర్ కే ఓటేసుకోవచ్చు కదా.. బీజేపీకి ఎందుకు వేయాలనే సందేహం సగటు ఓటర్ కు వస్తుందని బండి సంజయ్ కు అనిపించలేదు.

ధరణి విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో… టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ధరణి పోర్టర్ రద్దుకు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి హామీ ఇప్పించారు. ధరణి పోర్టల్ పై ముందు నుంచీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న బీజేపీ కూడా ఇదే హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు లోపాలు సవరించి..ధరణి పోర్టల్ కొనసాగిస్తామని… బండి సంజయ్ యూటర్న్ తీసుకోవడం బీజేపీకి ఇబ్బందికరమే.

ఇటీవల ధరణి పోర్టల్ ను వ్యతిరేకించే వారిపై కేసీఆర్ ఎదురుదాడికి దిగుతున్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు రావని చెబుతున్నారు. అసలు రైతు బంధుకు.. ధరణికి సంబంధం ఏమిటని.. కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ.. కేసీఆర్ వ్యూహంలో బండి సంజయ్ చిక్కుకున్నారు. ధరణికి అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించారు. కేసీఆర్ పై ఎన్ని ఆరోపణలు చేసినా.. కాంగ్రెస్ ను ఎన్ని తిట్టినా… బీఆర్ఎస్ చేస్తున్నవన్నీ మంచివేనని.. కొనసాగిస్తామని చెబితే.. మరి బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలన్న ప్రశ్న సగటు ఓటర్‌కు వస్తుంది. ఈ లాజిక్ బండి సంజయ్ ఎలా మిస్సయ్యారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close