తెలంగాణ టీడీపీ దూకుడు యాత్ర

కేసీఆర్ ప్రభుత్వంపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలతో జనంలోకి వెళ్తోంది. దానికి దీటుగా తెలుగు దేశం పార్టీ కూడా దూకుడుగా ముందుకెళ్లడానికి సిద్ధమైంది. రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపైనా కాంగ్రెస్ పార్టీ గత నెలలో వరసగా సభలు, దీక్షలు చేపట్టింది. ఇప్పుడు టీడీపీ రైతు సమస్యలపై పోరు యాత్ర తర్వాత విద్యార్థుల అంశంపై గళమెత్తనుంది.

విద్యార్థి పోరుయాత్ర పేరుతో ఈ నెల 9 నుంచి తలపెట్టింది. 11 విశ్వవిద్యాలయాల జేఏసీలను కలుపుకొని ప్రభుత్వంపై దండెత్తడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వానికి ఇబ్బందికరమే.

కేసీఆర్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించక పోవడంపై టీడీపీ మండిపడుతోంది. నియామకాలు లేక అవి నిర్వీర్యమయ్యాయని చెప్తోంది. ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ విద్యా వ్యవస్థకు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని టీడీపీ నేతలు లెక్కలతో సహా విమర్శిస్తున్నారు. తెలంగాణలోని కాలేజీలకు కేంద్రం నుంచి రావాల్సిన 3100 కోట్ల రూపాయల బోధన రుసుము సొమ్ము రాకుండా నిలిచిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. నిజంగానే ఇది తీవ్రమైన విషయం. దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంది.

తెలంగాణ సెంటిమెంటు విషయంలోనూ టీడీపీ కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. సీఎం కొత్త అధికారిక భవనం ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో మొదట ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన జీయర్ స్వామికి కూర్చోబెట్టడం ఏమిటనేది టీడీపీ ప్రశ్న. మొత్తానికి ఈసారి దూకుడుగానే జనంలోకి వెళ్లడం ద్వారా ప్రభుత్వాన్ని తూర్పార బట్టడానికి తెలంగాణ తమ్ముళ్లు బాగానే ప్రిపేర్అయినట్టు కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close