ఏపీఐఐసీ చైర్మన్‌కు జీతం వద్దట! అసలు కారణం ఏమిటంటే ?

అలవెన్స్‌లు అన్నీ కలిపి మూడున్నర లక్షల జీతం వస్తూంటే.. దాన్ని రూ. అరవై ఐదు వేలకు పరిమితం చేసింది ఏపీ ప్రభుత్వం. మరి మండిపోదా ?. అతి కష్టం మీదతెచ్చుకున్న రాజకీయ పదవుల్లో అధికారులు లేకుండా జీతాలు కూడా లేకుండా చేస్తా ఎలా? అని వైసీపీలోని నేతలు ఇప్పుడు గుస్సా అవుతున్నారు. రోజా తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ అయిన మెట్టు గోవిందరెడ్డి అనే నేతకు ఈవిషయంలో మండిపోయింది. తనకు ఆ రూ. ఆరవై ఐదువేలు కూడా వద్దని ప్రభుత్వమే ఉంచుకోవాలని .. తాను ఉచితంగా పని చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తనకు.. గౌరవ వేతనం అవసరం లేదని లేఖ రాశారు.

ఇంత కాలం జీతం తీసుకున్న గోవిందరెడ్డికి హఠాత్తుగా ఎందుకు సేవాభవం… వచ్చిందటే.. జీతం తగ్గించేశారు మరి. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సంస్థల ఛైర్మన్‌ల వేతనాలపై ప్రభుత్వం ఇటీవల సీలింగ్ విధించింది. వేతనాలు 65 వేల రూపాయలు మించరాదని పేర్కోంది. ఇటీవలి వరకూ ఏపీఐఐసీ ఛైర్మన్‌కు ఆర్ కేటగిరీ హోదాను ప్రభుత్వం కల్పించింది. వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకుగానూ 3లక్షల 82వేల రూపాయల వరకూ చెల్లించేవారు. కానీ ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్ గౌరవ వేతనాలపై సీలింగ్ విధించటంతో ఒక్కసారిగా ఏపీఐఐసీ ఛైర్మన్ వేతనం రూ.65 వేలకు తగ్గింది. ఈ మొత్తం తీసుకున్నామన్న పేరు కూడా ఎందుకనుకున్నారేమో కానీ అసలే వద్దని లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వం పార్టీ నేతలకు పదవులు ఇచ్చేందుకు ఎన్నో కార్పొరేషన్లు పెట్టింది. వాటన్నింటికీ నియామకాలు చేసింది. ఇప్పుడు అందరికీ ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. అనేక మందికి జీతాలు రావడం లేదు. అయినా ఎవరూ బయటపడటం లేదు.త ప్రాధాన్యత ఉన్న ఏపీఐఐసీ చైర్మన్ లాంటి పోస్టులకు కూడా తీతాలు అరవై ఐదు వేలకు పరిమితంచేయడంతో వారు ఏడవలేక నవ్వుతున్న పరిస్థితి. సలహాదారులు అయితే ఇంకా ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. వారి జీతాలపై సీలింగ్ విధించారో లేదో స్పష్టత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close