విశాఖ వైసీపీ నుంచి జంపింగ్ జిలానీలు ఎక్కువే !

విశాఖ వైసీపీ నుంచి ఒక్కొక్కరు జారుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే జెల్లకొట్టారు. ఆయన జనసేనలో చేరనున్నారు. రెండు రోజుల్లో మంగళగిరిలో చేరిక కార్యక్రమం ఉండనుంది. ఆయనతో పాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కూడా కండువా కప్పించుకోనున్నారు. విశాఖలో చాలా మంది వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు వస్తాయని భావిస్తున్న చోట్ల.. కర్చీఫ్ వేసుకుంటే.. మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పంచకర్ల గుడ్ బై చెప్పగా.. మరో ఇద్దరు , ముగ్గురు నేతలు అదే దారిలో ఉన్నారంటున్నారు.

విశాఖ వైసీపీలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. రాజధాని అని చెప్పినా ఎవరూ నమ్మకపోగా.. ప్రజలు భయపడుతున్నారు. బయటపడిన భూదందాల్లో తెర వెనుక.. తెర ముందు ఏం జరిగిందో విశాఖ ప్రజలకు అర్థం అయింది. అందుకే.. ఎందుకైనా మంచిదని అందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. జనసేనలో నేతల్ని చేర్పించే విషయంలో ఓ టీడీపీ నేత కీలకంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేనకు ఎక్కడెక్కడ టిక్కెట్లు రావొచ్చో అంచనా వేసి..అక్కడ వైసీపీ నుంచి బలమైన నేతల్ని జనసేనలోకి పంపుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ వలసలు విశాఖకే పరిమితం కావని.. ముందు ముందు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు కూడా విస్తరిస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికలసమయం దగ్గర పడే కొద్దీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం రాదన్న గట్టి నమ్మకంతో ఎందుకైనా మంచిదని ఇతర అవకాశాలు చూసుకుంటున్నారు. పరిస్థితి తేడా వస్తే.. వచ్చే ప్రభుత్వంలో తీవ్రమైన వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close