తల నరుక్కుంటా కానీ తల వంచను : తుమ్మల

కేసీఆర్ డైలాగ్‌ను రిపీట్ చేసి తుమ్మల నాగేశ్వరరావు ఆయన పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయిపోయారు. పాలేరు నుంచి టిక్కెట్ ఇస్తారని ఎదురు చూసిన ఆయనకు కేసీఆర్ షాకిచ్చారు . దీంతో భారీ బలప్రదర్శన చేసిన ఆయన.. తల నరుక్కుంటాను కానీ తల వంచనని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నిలబడి తీరుతానని ప్రకటించారు. ఎన్నికల నుంచి తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తన రాజకీయ జీవితం తనకు ఎవరిపై కోపం లేదని.. ప్రజల కోసం పోటీలో ఉంటానని ప్రకటించారు. ఏ పార్టీ అన్నది ప్రకటించలేదు.

ప్రజాసేవ కోసమే రాజకీయాలు అవసరమని.. తన జీవితాన్ని ఖమ్మం అభివృద్ధి కోసమే ధారబోశానన్నారు. తనకు పదవి అలంకారం మాత్రమేనని.. అహంకారం కాదన్నారు. మీ కోసం కష్టపడతాను.. మీతో శభాష్ అనిపించుకుంటానని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ ఖాయమని తేలడంతో… తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు కూడా ఖాయమని అనుకోవచ్చు. పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డికి కేసీఆర్ టిక్కెట్ ప్రకటించారు. తుమ్మల పార్టీ మారకుండా నామా నాగేశ్వరరావు ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ తనను అవమానించారని తుమ్మల మండిపడినట్లుగా తెలుస్తోంది. మీ ప్రేమ చూశాక మళ్లీ ఎమ్మెల్యేగా అడుగుపెడతానని నమ్మకం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ నిందించబోనని.. ఆత్మ గౌరవం కోసం ఎన్నికల్లో నిలబడతానన్నారు.

తుమ్మలను పార్టీలో చేర్చుకుని అడిగిన సీటు ఇవ్వడానికి బీజేపీ, కాంగ్రెస్ రెండూ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనతో రెండు పార్టీలూ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. తుమ్మల ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరం. ఆయన మళ్లీ టీడీపీలో చేరిన ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close