చింతమనేని మారిపోయారా..? టోల్ గేట్ సిబ్బందిపై కోపం వచ్చినా..!!

చింతమనేని అంటే ట్రేడ్ మార్క్‌గా ఆయన దురుసు ప్రవర్తనే కనిపిస్తుంది. అయితే.. ఈ సారి ఆయన తన కోపాన్ని తీవ్రంగా దిగమింగుకుని.. ఎవర్నీ దూషించకుండా వెళ్లిపోయారు. గుంటూరు వైపు నుంచి ఆయన విజయవాడ వెళ్తున్న సమయంలో మంగళగిరి మండలం కాజా టోల్‌ గేట్‌ వద్ద సిబ్బంది ఆపేశారు. ఎమ్మెల్యే పాస్ ఉందని చెప్పినా.. కారుకు నెంబర్ ప్లేట్ లేదన్న కారణంగా టోల్ గేట్ సిబ్బంది.. కారును కదలనివ్వలేదు. ఎంత సేపు చెప్పినా వినకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు.

ఎవరు ఎదిరించినా… చెప్పిన మాట వినకపోయినా… ముందుగా.. దండించే ప్రయత్నం చేస్తారు చింతమనేని. అయినా ఈ సారి మాత్రం.. ఆయన ఆ వివాదానికి చోటివ్వలేదు. నిజానికి చోట్ల గేట్ల వద్ద సిబ్బంది చూపించే అత్యుత్సాహానికి… తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలు.. అనుచరులతో కలసి వస్తున్న సమయంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. టోల్ గేట్లను బద్దలు కొట్టేసి.. సిబ్బందిని చితకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ చింతమనేనికి.. అలాంటి ట్రాక్ రికార్డ్ చాలా ఉన్నప్పటికీ… మరో కొత్త వివాదం తెచ్చుకోవడం ఇష్టం లేక పెళ్లిపోయారు.

ఈ విషయం కలకలం రేపుడంతో.. టోల్ గేట్ సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. వాహనంపై… నెంబర్ ప్లేట్ లేదని.. అందుకే పోనివ్వలేదని చెప్పుకొచ్చారు. చింతమనేనికి క్షమాపణ చెప్పారు. అయితే..అలా కారు వదలిసి వెళ్లిపోయారని.. ఆయనది దుందుకుడు ప్రవర్తన అంటూ.. జగన్ మీడియాలో వార్తలు వచ్చాయి. చింతమనేని ఏం చేసినా.. దురుసు ప్రవర్తనగా చూపించడానికి ఆ మీడియా ఉత్సాహ పడుతుంది కానీ.. అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయదన్న విమర్శలు చింతమనేని అనుచరుల నుంచి వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close