సాగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..! పోటీలో కాదు.. అభ్యర్థి కోసమే..!

ముందు బీజేపీ ప్రకటిస్తే.. తర్వాత మేం అభ్యర్థిని ప్రకటిస్తాం అని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నారు. ముందు టీఆర్ఎస్ ప్రకటిస్తే.. ఆ తర్వాత మేం అభ్యర్థిని ఖరారు చేస్తామని బీజేపీ నేతలు తీర్మానించుకున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ పార్టీలో  అసంతృప్తుల్లో  ఒకరిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీ ప్లాన్. అలాంటిచాన్స్  బీజేపీకి ఇవ్వకూడదని.. అభ్యర్థిని ఫైనల్ చేసుకున్నా అధికారిక ప్రకటన చేయని పరిస్థితి టీఆర్ఎస్‌ది. నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగుస్తుంది. ఇప్పటికీ రెండు పార్టీలు అభ్యర్థులెవరో  క్లారిటీ ఇవ్వలేదు.

టీఆర్ఎస్ అధినేత టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకున్నారు. కానీ బయటకు చెప్పడం లేదు. చనిపోయిన నర్సింహయ్య కుమారుడు భగత్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన రంజిత్‌ యాదవ్, గురువయ్య యాదవ్ పేర్లు ప్రగతి భవన్ నుంచి లీకయ్యాయి. కానీ రిస్క్ ఎందుకని నోముల భగత్‌కే కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారని అంటున్నారు. కానీ ఇతర నేతలు బీజేపీలోకి వెళ్లకుండా వారి పేర్లనూ ఖరారు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరో తేలకపోయినా టీఆర్ఎస్ మాత్రం మండలాల వారీగా ఓ విడత ప్రచారం పూర్తి చేసేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలిచ్చారు.

మరో వైపు బీజేపీలో టిక్కెట్ పోటీ ఎక్కువగానే ఉంది కానీ.. వారంతా  బలమైన అభ్యర్థులుగా బీజేపీ అగ్రనాయకత్వం భావించడం లేదు. టీఆర్ఎస్ నుంచి కోటి రెడ్డి లేదా చిన్నపరెడ్డిలను ఆకర్షించి.. పోటీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా… టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతేనే ఆలోచిస్తామని వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎస్టీ అభ్యర్థినిరంగంలోకి దింపితే ఎలా ఉంటుందా అని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. రవి నాయక్ అనే నేతను నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోమని సూచించినట్లుగా చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించడానికి మాత్రం సిద్ధంగా లేరు. మొత్తానికి ముందు నువ్వంటే.. నువ్వని..  రెండు పార్టీలు… పంతాలకు పోయి.. చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించకుండా ఉండేలా ఉన్నారనే సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close