బీజేపీయేతర పార్టీలతో కలుస్తున్న టీఆర్ఎస్ !

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా విపక్షాల తరపున బరిలోకి నిలబడిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఆయన నామినేషన్‌లో కేటీఆర్ తన ఎంపీలతో కలిసి పాల్గొననున్నారు. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే యశ్వంత్ సిన్హాకు గెలుపు అవకాశాలు లేవు. కానీ పోటీ మాత్రం అనివార్యం. బీజేపీ తరపున ఎంత మంది వ్యతిరేకంగా నిలబడుతున్నారనేది కీలకం. టీఆర్ఎస్ ఈ విషయంలో గట్టిగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన సమావేశాలకు హాజరు కాకపోయినా యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు మాత్రం హాజరవుతున్నారు.

బీజేపీలో గట్టిగా తలపడాలన్న ఆలోచనతో ఉన్న టీఆర్ఎస్.. ఇప్పటికి బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. ఏ క్షణమైనా ప్రకటించవచ్చని చెబుతున్నారు కానీ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ప్రకటన చేస్తే సీరియస్ నెస్ ఉండదని భావిస్తున్న కేసీఆర్.. మొత్తం ప్రక్రియ అయ్యే వరకూ వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మంచి రోజులు ఉండవు. అందుకే.. జూలైలో ఎలాంటి ప్రకటన బీఆర్ఎస్‌పై ఉండదని.. ఆగస్టులో ఉండవచ్చని చెబుతున్నారు.

అయితే బీజేపీని ఎదుర్కోవాలంటే.. పార్టీలు.. కూటములు సాధ్యం కాదని.. అందరూ ఏకతాటిపైకి రావాలనే చర్చ ఉంది. రాష్ట్రాల వారీగా ఇలా అందరూ బీజేపీని టార్గెట్ చేసుకుని పోరాడితే ఫలితం పొందవచ్చని లేకపోతే… విపక్షాల అనైక్యత వల్లే మోదీ గెలుస్తారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ద్వారా విపక్షాలు ఏకం అయితే.. ఆ ఐక్యత ముందు ముందు సాగితే… దేశ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అదంత తేలిక కాదని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐ ప్యాక్ కే పాఠాలు బోధిస్తున్న జగన్ రెడ్డి -విషయం ఏంటంటే..?

2019 నుంచి వైసీపీకి రాజకీయంగా సేవలందిస్తోన్న ఐ ప్యాక్ టీమ్ కు జగన్ రెడ్డి పాఠాలు బోధించడం రాజకీయ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.కొన్నేళ్లుగా ఐ ప్యాక్ డైరక్షన్ లో సాగుతున్న జగన్...

ఎడిటర్స్ కామెంట్ : ఏపీకి రాక్షస రాజకీయ గాయం

పచ్చగా ఉన్న రాష్ట్రం ఓ వ్యక్తి స్వార్థం కోసం .. పదవి కోసం రక్తమోడుతోంది. అధికారం నిలబెట్టుకోవాలన్న తపనతో చేస్తున్న.. చేసిన రాజకీయం మొత్తం ఏపీని ప్రపంచం ముందు ఓ ఆటవిక...

కోవిషీల్డే కాదు… కోవాగ్జిన్ తోనూ ప్రమాదమే..!!

కరోనా వైరస్ నిర్మూలన కోసం తయారు చేసిన కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్ నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించగా... భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ తో కూడా దుష్ఫలితాలు ఉన్నాయని తాజాగా...

ఓటమి భయమా – మోడీ, షా వ్యాఖ్యల అంతరార్ధం ఇదేనా..?

ఓ వైపు మేమే అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా... ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం చార్ సౌ పార్ నినాదాన్ని వదిలేసి ఇండియా అధికారంలోకి వస్తే అంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close