స‌ర్దార్‌తో ఆడుకొంటున్నారు క‌ద‌య్యా..

ఇక్క‌డ రాంగోపాల్ వ‌ర్మ‌కీ, బాలీవుడ్‌లో క‌మాల్‌ఖాన్‌కీ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప ఇంకొక‌రు క‌నిపించ‌రేమో..?? ఎప్పుడూ ప‌వ‌న్ గురించే ట్వీట్లు చేసుకొంటూ.. జ‌నం దృష్టిలో ప‌డాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ఇప్పుడు ఇద్ద‌రూ ఒకేసారి… ప‌వ‌న్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్లు చేశారు. వ‌ర్మ ప‌వ‌న్‌ని వెన‌కేసుకొస్తుంటే… కమాల్ ఖాన్ మాత్రం ప‌వ‌న్ ప‌రువు తీసేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఇద్ద‌రూ స‌ర్దార్‌ని టార్గెట్ చేసుకొంటూ.. ట్విట్ట‌ర్‌లో వార్ నడుపుతున్నారు. అయితే ఈ యుద్దానికి తెర లేపింది మాత్రం వ‌ర్మ‌నే. బాహుబ‌లి కోసం ప్ర‌సాద్ ఐమాక్స్ ద‌గ్గ‌ర కిలోమీట‌రున్న‌ర క్యూ క‌నిపించింది… ఇక స‌ర్దార్‌కి ఎంతుంటుందో అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

దానికి క‌మాల్ ఖాన్ ‘జీరో’ అంటూ బ‌దులిచ్చాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌నీ, ప్ర‌భాస్‌నీ పోల్చొద్ద‌ని.. ప్ర‌భాస్ స‌ల్మాన్ అయితే ప‌వ‌న్ ఆయుష్మాన్ ఖురాలాతో స‌రితూగుతాడ‌ని వెట‌కారం చేస్తున్నాడు క‌మాల్‌. అక్క‌డితే ఆగ‌లేదు. స‌ర్దార్‌ని ప‌ట్టుమ‌ని ప‌దిమంది చూసినా, తెలుగు రాష్ట్ర్రాల్లో తాను న‌గ్నంగా ప‌రుగెడ‌తాడ‌న‌ని.. కాస్త హ‌ద్దు దాటేశాడు. వ‌ర్మ కూడా ఘాటుగానే బ‌దులిచ్చాడు. బ‌ట్ట‌లిప్పుకొని రెడీగా ఉండూ అంటూ రీ ట్వీట్ చేశాడు. ప‌వ‌న్ గురించి నీకు తెలీద‌ని వ‌ర్మ కూడా గ‌ట్టిగానే స‌వాల్ విసిరాడు. మొత్తానికి రోజు రోజుకీ పెరుగుతున్న స‌ర్దార్ హైప్‌కి క‌మాల్ కామెంట్లు దిష్టి చుక్క‌గా మారాయి. ఇక‌… స‌ర్దార్ దిష్టి పోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close