విజయసాయిరెడ్డికి స్టాంప్ వేయరా..? టీఎస్ పోలీసులకు వర్ల లేఖ..!

హాకీ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు కూడా క్వారంటైన్ స్టాంప్ వేశారని.. కానీ హైదరాబాద్ – విజయవాడ – విశాఖ మధ్య తిరుగుతున్న విజయసాయిరెడ్డిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని.. తెలంగాణ పోలీసులకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారని.. వర్ల ప్రశంసించారు. కొద్ది రోజుల కిందట.. నల్లగొండ దగ్గర.. కారులో వస్తున్న పుల్లెల గోపీచంద్‌కు.. అక్కడి పోలీసులు హోంక్వారంటైన్ ముద్ర వేశారు. ఇది సోషల్ మీడియాలో హైలెట్ అయింది. అయితే.. వర్ల రామయ్య మాత్రం.. ఆ ముద్రను భిన్నమైన కోణంలో చూశారు.

తెలంగాణ పోలీసులు ఎవర్నీ వదిలి పెట్టకుండా.. రాష్ట్రంలోకి వస్తున్న వారందరికీ క్వారంటైన్ ముద్ర వేస్తున్నారని.. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం ఎందుకు వేయడం లేదనే డౌట్ ఆయనకు వచ్చింది. అందుకే నేరుగా లేఖ రాశారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి విజయసాయిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండనంత బిజీగా ఉన్నారు. ఆయన ఏ రోజూ లాక్ డౌన్ పాటించలేదు. వారాంతాల్లో ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఎక్కువగా విజయవాడలో ఉంటున్నారు. తన కార్యక్షేత్రం విశాఖలోనూ.. తరచుగా కనిపిస్తున్నారు. తన ట్రస్ట్ పేరిట ఉత్తరాంధ్ర మొత్తం సహాయ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. వాటిని అందించడానికి అప్పుడప్పుడు స్వయంగా వెళ్తున్నారు.

అంటే.. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకూ విజయసాయిరెడ్డి తిరుగుతూనే ఉన్నారు. దీన్నే వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆయనకు హోం క్వారంటైన్ స్టాంప్ వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఈ లేఖను పరిగణనలోకి తీసుకోరు కానీ.. విజయసాయిరెడ్డి లాక్ డౌన్ ను పట్టించుకోుండా… అటూ ఇటూ తిరుగుతున్నారని జనం దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రం.. వర్ల రామయ్యకు.. ఇదో మంచి అవకాశంలా దొరికింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close