ఎవరి కళ్లలో ఆనందం కోసం కళా అరెస్ట్..!?

శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఇంట్లో భోజనం చేస్తున్న కళా వెంకట్రావు ఇంటిని వందల మంది పోలీసులు చుట్టుముట్టి .. పూర్తిగా భోజనం కూడా చేయకముందే.. బలవంతంగా తీసుకెళ్లారు. ఆయనను ఎంత బలవంతంగా తీసుకెళ్లారో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ అందరికీ గుర్తొచ్చింది. అరెస్ట్ చేసినట్లుగా చెప్పిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. చివరికి చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్టేషన్ బెయిల్ ఇస్తున్నట్లుగా చెప్పి … స్టేట్‌మెంట్ తీసుకుని విడుదల చేశారు. ఇంత బలవంతంగా అరెస్ట్ చేయడం ఎందుకు..? స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడం ఎందుకు..? .. ఇంత అలజడి రేపాల్సిన అవసరం ఎందుకన్నదే ఇప్పుడుచాలా మందిలో ఉన్న సందేహం.

కళా వెంకట్రావు సౌమ్యుడు. ఎవరితోనూ కనీసం పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు. కనీసం గొంతు పెద్దది చేసి గద్దించే స్వభావం కూడా కాదు. సాధారణంగా రాజకీయాల్లో ఉంటే… రాస్తారోకో.. ధర్నా కేసుల్లాంటివైనా ఉంటాయి. కానీ.. కళా వెంకట్రావు మీద .. ఆయన రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క కేసు లేదు. కానీ రామతీర్థం కొండ కింద.. ఎవరో వాటర్ బాటిళ్లు, చెప్పులు వేశారని . .. దానికి కళా వెంకట్రావు కారణం అని ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసులో ఇతరుల్ని అరెస్ట్ చేశారు. తర్వాత కళాను కూడా అరెస్ట్ చేశారు. కళాను అరెస్ట్ చేశారన్న విషయం బయటకు తెలిసిన తర్వాత చాలా మందిలో పోలీసులు తప్పు చేస్తున్నారన్న అభిప్రాయమే వినిపించింది.

మామూలుగా నోటీసులు ఇస్తే విచారణకు వస్తారు. పోలీసులు ఎవరైనా అదే చేస్తారు. కానీ ప్రభుత్వ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చినట్లుగా సృష్టించుకుని.. అరెస్ట్ చేయాలన్న తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోంది. ఇప్పుడు కళా వెంకట్రావు విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మందికి… టీడీపీ నేతల్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని… అదీ కూడా భయభ్రాంతులకు గురి చేసేలా మానసికంగా వేధిస్తూ అరెస్ట్ చేయాలని లక్ష్యం. అలా చేసినప్పుడు… అదో రకంగా సంతోష పడతారని చెబుతారు. ఆ సంతోషం కోసం.. ఇలాంటి అరెస్టులు జరుగుతూ ఉంటాయన్న చర్చ కూడా నడుస్తోంది.

మూడు వారాల కిందట… ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అప్పటి వరకూ ఆయన పులివెందులలోనే ఉన్నారు. ఆయన చెన్నై వెళ్తున్నాడని తెలిసి… అక్కడి ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి.. విజయవాడకు వచ్చి టీడీపీ సమావేశాల్లో పాల్గొంటారని తెలిసి… లాంజ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. అదేం పద్దతని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కానీ.. ఏపీలో పోలీసుల్ని వాడుకుని చేస్తున్న భయభ్రాంతుల రాజకీయంలో ఇదో భాగమని ఆయన తర్వాత గుర్తించారు. ఇప్పుడు కళా వెంకట్రావు విషయంలోనూ అదే జరిగింది. పోలీసులతో తాము ఏమైనా చేయగలమన్న ఓ భయాన్ని ప్రతిపక్ష నేతల్లో సృష్టించడానికి… పోలీసుల్ని నిస్సంకోచంగా వాడుకుంటున్నారని స్పష్టంగా తేలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close