ఉద్యోగాలు ఎవరెక్కువ ఇచ్చారు మోదీనా ? కేసీఆరా ?

దీపావళి సందర్భంగా పండగ చేసుకోమని 75వేల మందికి నియామకపత్రాలు ఇచ్చారు మోదీ. దీని కోసం విస్తృత ప్రచారం చేశారు. కొన్నాళ్ల కిందట.. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఖాలీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా 75వేల నియామకాలు చేశారు. ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారో.. ఎలా భర్తీ చేశారో తెలియదు కానీ.. నియామకపత్రాలిచ్చారు. మిగతా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. అయితే ఈ భర్తీపై తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. పెద్ద డ్రామాలాడుతున్నారని భారీ లేఖ రాశారు.

ఉత్తుత్తి ఉద్యోగాలిస్తున్నారని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని లేఖలో ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. లేఖలో కేటీఆర్ చాలా ఆవేశం ప్రదర్శించారు. అయితే అందులోనే తాము లక్షల సంఖ్యలో ఉద్యోగాలిచ్చామని చెప్పుకున్నారు. ఓ చిన్న రాష్ట్రామే లక్షల్లో ఉద్యోగాలిస్తే కేంద్రం ఎందుకు ఇవ్వదని ఆయన వాదించారు. ఆయన లేఖ తెలంగాణ నిరుద్యోగుల్లోనూ విస్తృతంగా చర్చకు వచ్చే చాన్స్ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆరేడు నెలల కిందట 80వేల ఉద్యోగాల భర్తీ ప్రకటించారు. వాటిప్రక్రియ మెల్లగా సాగుతోంది.

మోదీఅయినా ఒక్క సారిగా 75వేల ఉద్యోగాల నియామకపత్రాలిచ్చారు. కానీ తెలంగాణలో ఇంకా నియామక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఎన్నికల వరకూ ఈ ఉద్యోగ నియామకాలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్రాన్ని నిందించాలనుకుంటే ముందుగా అందరి చూపు.. తెలంగాణ సర్కార్ వైపే ఉంటుంది. కానీకేటీఆర్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఉద్యోగాల భర్తీలో తామే ది బెస్ట్ అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close