కోడి కత్తి శీనుకు బెయిల్ ఎందుకు రావడం లేదు ?

జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన జనపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఏడో సారి కొట్టి వేసింది. ఆయన నాలుగేళ్లు దాటి జైలులోనే ఉన్నారు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసి. ఆ నేరాన్ని అంగీకరించిన వారికి కూడా బెయిల్ వచ్చింది. అంత కంటే తీవ్రమైన నేరాలు చేసిన వారికీ బెయిల్ వచ్చింది. కానీ జనపల్లి శ్రీనివసరావు మాత్రం జైల్లోనే మగ్గిపోతున్నారు. ఆయన తల్లి బెయిల్ ఇప్పించాలని జగన్ వేడుకుంటున్నారు. కానీ పట్టించుకుంటున్న దిక్కులేదు.

నిజానికి జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఎప్పుడో వచ్చింది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఎన్ఐఏ కోర్టు బెయిలిచ్చింది. కానీ బెయిల్ రద్దు చేయించాలని ప్రభుత్వం వైపు నుంచి సూచన రావడంతో ఎన్ఐఏ హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు హైకోర్టుకు వెళ్లి ఎన్ఐఏ బెయిల్ రద్దు చేయించింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు బెయిల్ ఇచ్చినా ఇబ్బంది లేదని ఓ లేఖ ఇస్తే ఎన్ఐఏ బెయిల్ వచ్చేలా చూస్తుందని అనుకున్నారు. కానీ అలాంటి లేఖ ప్రభుత్వం నుంచి రావడం లేదు. జనపల్లి శ్రీనివాస్ జైలు నుంచి విడుదల కావడంలేదు.

జనపల్లి శ్రీనివాస్ .. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. ఆయన జగన్‌ అభిమాని. జగన్ కు సానుభూతి వెల్లువెత్తాలని ఇదంతా చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఎన్ఐఏ చార్జిషీటులోనూ అదే చెప్పింది. హాని చేయాలని పిసరంత కూడా లేదని చెప్పుకున్నారు. ఆ కోడి కత్తి తో గిసిన గాయాన్ని తొమ్మిది కుట్లుగా మార్చుకుని జగన్ చాలా రాజకీయం చేసి కావాల్సినంత సానుభూతి పొందారు. కానీ దీనికి కారణమైన శ్రీనివాస్ మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close