నేడు మరోసారి విచారణకు కవిత – మళ్లీ టెన్షన్ !

ఈడీ ఆఫీసులోకి వెళ్లినప్పటి నుండి కవిత బయటకు వస్తారా అటు నుంచి అటు జైలుకు వెళ్తారా అని ఇటు ప్రగతి భవన్ నుంచి అటు ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లోని కవిత నివాసం వరకూ ఒకటే టెన్షన్. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్నదానిపై కార్యాచరణ రెడీ చేసుకున్నారు. కానీ కవితను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. సోమవారం రాత్రి వరకూ ప్రశ్నించినా మళ్లీ మంగళవారం ఉదయం 11 గంటలకల్లా రావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో హాజరు కాక తప్పని పరిస్థితి.

తనను ఇంటి వద్దే ప్రశ్నించాలని… సాయంత్రం ఐదు తరవాత వదిలి పెట్టాలని ఇలాంటి రకరకాల షరతులతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది తేలిన తర్వాతనే విచారణకు వస్తానని మొదట లేఖ రాశారు. తర్వాత ప్లాన్ మార్చుకుని విచారణకు హాజరవుతున్నారు. కానీ అరెస్ట్ భయం మాత్రం పొంచి ఉంది. కవితపై పక్కాగా ఆధారాలున్నాయని ఈడీ అధికారులు ఇప్పటికే న్యాయస్థానాలకు చెప్పి ఉన్నారు . డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియానే అరెస్ట్ చేసిన తర్వాత కవితను అరెస్ట్ చేయకుండా ఉండరన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితులందర్నీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో ఎవరికీ బెయిల్ కూడా రాలేదు. చాలా కాలంగా జైళ్లలోనే ఉంటున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కుట్ర మొత్తం చేసిన టాప్ త్రీలో ఒకరిగా కవితను పేర్కొంటున్నప్పటికీ ఆమెను మాత్రమే అరెస్ట్ చేయలేదు. మంగళవారం కూడా ఆమె ఈడీ ఆఫీసుకు వెళ్తారు. అయితే బయటకు వస్తారా అటు నుంచి అటు జైలుకు వెళ్తారా అన్నది మాత్రం ఈడీ అధికారుల చేతుల్లోనే ఉంది. వారేమనుకుంటే అదే జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close