ఏలూరు బాధితులకు ప్రభుత్వ సాయం లేదా..!?

ఏలూరులో వింత వ్యాధి బాధితులకు ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం ప్రకటించకపోవడంపై అక్కడి ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా.. ఎవరైనా ఆకస్మాత్‌గా బాధితులుగా మారిన వారి పట్ల ఎంతో ఔదార్యం చూపుతూ ఉంటారు. ఎల్జీ ఘటనలో మృతులకు రూ. కోటి నష్టపరిహారం ప్రకటించడమే కాదు.. మనిషికిరూ. పదివేల చొప్పున పంపిణీ చేశారు. ఏలూరులో బాధితులు అంత మంది లేరు. ఒక్కరు చనిపోయారు. ఓ ముప్ఫై మంది పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉంది. వారిని విజయవాడ, గుంటూరు తరలించి చికిత్స అందిసత్తున్నారు. ఐదు వందలమందికిపైగా.. చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరికి ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని… ఏలూరు ప్రజలు ఆశించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు.. బాధితులకు సాయం ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. అయితే.. ఆస్పత్రిలో రోగులను పరామర్శించి.. ధైర్యం చెప్పి వెళ్లారు.కానీ ఎలాంటి సాయమూ ప్రకటించలేదు. సమీక్ష చేసిన తర్వాత అయినా.. చేస్తారని అనుకున్నారు. కానీ.. ప్రభుత్వానికి ఏలూరు బాధితులకు సాయం చేసే ఆలోచన లేదన్న అభిప్రాయం ఇప్పుడు ఏర్పడుతోది. ఎలాంటి నష్టపరిహారం చెల్లించే యోచన ప్రభుత్వానికి లేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వారికి.. రూ. కోటి నష్టపరిహారం ఇచ్చిన జగన్… ఏలూరు విషయంలో మరింత ఉదారంగా ఉంటారని అనుకున్నారు.

ఏలూరు వింత వ్యాధిపై బాధితులు వందల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ మానసికంగా కూడా ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం.. తామున్నామన్న భరోసా ఇవ్వడానికైనా..ఎంతో కొంత సాయం ప్రకటించి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో ఎలాంటి ఘటన జరిగినా.. పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. కానీ ఏలూరు విషయంలో మాత్రం అలాంటి సాయం చేయడానికి ఆయన ఎందుకో సిద్ధంగా లేరన్న అభిప్రాయం అక్కడిప్రజల్లో వ్యక్తమవుతోంది. కారణాలు తెలిసిన తర్వాతైనా జగన్ పరిహారం ఇస్తారని.. ఏలూరు బాధితులు ఆశగా ఉన్నారు. మరి చేస్తారో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close