దళిత నేతలతో తీర్పుపై కామెంట్లు చేయిస్తున్న వైసీపీ !

అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత వైసీపీ భిన్నమైన మార్గంలోకి వెళ్తోంది. దళిత నేతలతో హైకోర్టు తీర్పులపై కామెంట్లు చేయిస్తోంది. అదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు మాత్రం న్యాయస్థానంపై గౌరవం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం విషయంలో ఏం జరిగినా తానే మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అమరావతి విషయంలో ప్రెస్ మీట్ పెట్టారు. రూ. లక్ష కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయలేదని.. తమదే కానీ ఏ ప్రభుత్వమూ మోయలేదన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తామని.. తమది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదని.. రాష్ట్ం మొత్తాన్ని సమానంగా చూస్తామ్నారు. అమరావతి పీక నొక్కడానికి వైసీపీ మొదట్లో వినిపించిన వాదన ఇది. ఆ తర్వతా స్మశానం.. అని అవినీతి అని.. చాలా చెప్పారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత అదే వాదనకు వచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని స్పష్టమైన డాక్యుమెంట్ ఉన్నా వైసీపీ మాత్రం ఈ వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది.

అదే సమయంలో దళిత నేతలతో కోర్టు తీర్పుల వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత హైకోర్టుకు అవగాహన లేదన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని చెప్పే వారికి అవగాహన లేదని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని కేంద్రం చెప్పిందని సుచరిత పేర్కొన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీకి చెందిన మరో దళిత ఎణ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదని చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమని… ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని కోరుముట్ల విమర్శించారు.

వైసీపీలో ఎవరైనా హైకమాండ్ ఎలా స్పందించాలో చెప్పిన తర్వాతే స్పందిస్తారు. ముఖ్యంగా దళిత నేతలు పార్టీ విధానాలపై స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మాట్లాడారు. ఈ ప్రకారం దళిత నేతలతో తీర్పులపై వ్యాఖ్యానించి.. తాము మాత్రం గౌరవిస్తామని చెబుతున్నారు. వైసీపీ ఈ డబుల్ గేమ్ ఎంత కాలం ఆడుతుందో కానీ.. న్యాయవ్యవస్థపై నిందలేయడం మాత్రం మానుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్: విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డ‌బుల్ ట్రీట్’

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈనెల 9... విజ‌య్ పుట్టిన రోజున అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇదో పిరియాడిక్...

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

చైతన్య : టాలీవుడ్ పౌరుషం ఇంతేనా ?

సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close