వంశీ సహా వాళ్లందరికీ సెక్యూరిటీ పెంపు !

చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు ,ప్రజాప్రతినిధులకు భద్రతను భారీగా పెంచారు. వల్లభనేని వంశీకి ఇప్పుడు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఏకంగా ఫోర్ ప్లస్ ఫోర్‌కు పెంచారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మొదట విమర్శలు, ఆరోపణలు ప్రారంభించింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే. ఆయన సాక్షి మీడియాకు ఓ సారి ఇంటర్యూ ఇచ్చి లోకేష్‌, ఆయన తల్లి భువనేశ్వరిపై అనుచితంగా మాట్లాడారు.

ఆ తర్వాత ఈ అంశాన్ని అసెంబ్లీలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడారు. తన భార్యను కించ పరచడం తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకుని అసెంబ్లీకి రాబోనని సవాల‌్ చేశారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు అన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆ మాటలన్నవారందరికీ భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు.

బెదిరింపులు వస్తున్నాయని అందుకే భద్రత పెంచుతున్నట్లుగా చెబుతున్నారు. గతంలో తీవ్రమైన ముప్పు ఉన్న టీడీపీ నేతలకు కూడా భారీగా సెక్యూరిటీని తగ్గించారు. ఇప్పుడు టీడీపీ నేతలు.. ఎన్టీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close