మాది చిన్నదే తెలంగాణది రూ. 40వేల కోట్ల స్కామన్న ఏపీ సర్కార్ !

అప్పుల బండారాలు తవ్వేకొద్దీ బయటపడుతున్న ఏపీ సర్కార్…. తాము చేస్తున్న తప్పులు చిన్నవేనని.. తెలంగాణ సర్కార్ అంతకు మించి చేసిందనే విషయాలను బయట పెడుతోంది . ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయలసీమ ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయకుండా…. పనులు చేసినట్లుగా చూపించి రూ. 900 కోట్లను . .. నేరుగా రుణం తీసుకున్న ఆర్ఎఫ్‌సీ, పీఎఫ్‌సీ సంస్థల నుంచి కాంట్రాక్ట్ సంస్థ అయిన మేఘాకు మళ్లించారని పీఏసీ చైర్మన్ పయ్యావుల ఆరోపించారు. దీనిపై పత్రాలు బయట పెట్టారు. ఇది రాష్ట్రంలో సంచలనం అయింది.

దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పనులు జరిగాయని చెప్పలేదు. కానీ పనులు జరిగినట్లుగా ఎన్జీటీ నిర్ధారించిందంటూ కొత్త కథలు చెప్పింది. రాయలసీమ కరువు నివారణ పేరుతో ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడంపై ఎన్జీటీ నిషేధం విధించింది. దీంతో ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అప్పటికీ కొన్ని పనులుజరిగాయని ఎన్టీటీ రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టును అడ్డం పెట్టుకుని మేఘా కు నిధులు.. మళ్లించారు. ఎలక్ట్రో మెకానికల్ పనులు జరిగినట్లుగా ఆ నిధులు తీసుకున్నారు. కానీ అక్కడ అలాంటి పనులే జరగలేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు.

అసలు ఏ అప్పు అయినా రణ సంస్థ నుంచి నేరుగా ఎలా కాంట్రాక్టర్ కు బదిలీ చేస్తారనేది సంచలనంగా మారింది. కన్సాలిడేటెడ్ ఫండ్ కు వస్తేనే… లెక్కల్లో కనిపిస్తుంది. లేకపోతే కనిపించదు. అయితే ఇలా రాకుండానే కాంట్రాక్టర్ కు ఇచ్చేయవచ్చని.. కాళేశ్వరం విషయంలో తెలంగాణ రూ. 40వేల కోట్లు ఇలా కాంట్రాక్ట్ సంస్థకు మళ్లించిందని సమర్థించుకుంది. ఏపీ సంగతి చెప్పమంటే.. సాక్ష్యంగా తెలంగాణ సర్కార్ ను చూపించడంతో .. ఇప్పుడు వివాదం ప్రారంభమయింది. తెలంగాణ మేఘా ఖాతాలోకి… రూ. నలభై వేల కోట్లు మళ్లించిందా అన్న చర్చ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close