పాపం వైసీపీ – ఐటీ నోటీసుల్ని పట్టుకుని ఈదేస్తోంది… !

అధికారంలోకి వచ్చి నాలుగున్నరేల్లు అయింది. ఆరు లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలు వేశారు. ఇప్పటికీ నయాపైసా అవినీతి చూపించలేకపోయారు. పైగా పోలవరంలో అవినీతి లేదని స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చారు. అమరావతిలో ఆళ్ల పేరుతో ఫిర్యాదులు చేయించడం తప్ప.. స్కాం జరిగిందని ఒక్క ఆధారం బయట పెట్టలేకపోయారు. హెరిటేజ్ మజ్జిగను వేలు పెట్టి కొన్నారని ఆరోపించారు. ఇలా చిన్నా చితకా ఆరోపణల దగ్గరనుంచి భారీ స్కాంల వరకూ చాలా ఆరోపణలు చేశారు. లెక్కలేనన్ని ఎంక్వయిరీలు వేశారు. ఒక్క రూపాయి కూడా బయట పెట్టలేకపోయారు.

అయితే ఇప్పుటు ఐటీ నోటీసులు చంద్రబాబుకు వచ్చాయంటూ హడావుడి ప్రారంభించారు. ఆ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అందులో డబ్బులు తీసుకున్నట్లుగా ఎక్కడా లేదు. సీబీఎన్ స్టీల్ అనే కోడ్ వాడారాని అవి టన్నుల లెక్కలో ఉన్నాయని.. అవి డబ్బులేనని ఐటీ నోటీసుల్లో ఉంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడం కోసమే .. ఇలాంటి నోటీసులు ఇచ్చారేమో అన్నట్లుగా ఉన్న వ్యవహారాన్ని ప్రణాళికాబద్దంగా ప్రచారం చేయడానిక వైసీపీ వాడుకుంటోంది.

ఓ సారి హిందూస్తాన్ టైమ్స్ లో మరోసారి డెక్కన్ క్రానికల్ లో ఇంకోసారి పయనీర్ లో ఇలా నోటీసుల్ని రాయించుకుని.. వాటిపై తమ నేతల్ని ప్రెస్మీట్లు పెట్టిస్తోంది. అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. నిజంగా ఏదైనా ఉంటే.. ఐటీ వాళ్లు కదా అడగాల్సింది..కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ నోటీసులతో ఈదేయాలనుకుంటున్నారు. ఈ నోటీసుల్లో పస లేదని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రెస్ మీట్ లోనే అంగీకరించారు. సాంకేతిక అంశాలతో చంద్రబాబు తప్పించుకున్నారని అన్నారు. అంటే అందులో విషయం లేదని ఆయనకూ అర్థమైంది. నిజంగా డబ్బులు అవినీతి జరిగితే ఏ సాంకేతిక అంశమూ అడ్డు రాదు. ఆ విషయం సజ్జలకు బాగా తెలుసు.

అడ్డగోలు సంపాదనలో రాటుదేలిపోయి.. ప్రజల ఆస్తుల్ని రక్తాల్ని కూడా పిలుస్తున్న వైసీపీ నేతలు.. చంద్రబాబుపై ఎక్కడో మేనేజ్ చేసి ఇప్పించిన ఓ నోటీసును పట్టుకుని వచ్చి.ి. ఆ బురదంతా తమకు పూయాలని అనుకోవడం అమాయకత్వం అని..టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close