అమరావతి మహోద్యమ వేదికపై వైసీపీ ఎంపీ.. !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు. ఆయన ఏపీలో అడుగు పెడితే దాడులు చేస్తారని.. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారాల మధ్య ఆయన చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన హైదరాబాద్ నివాసానికి వస్తే అంతకు మించిచాన్స్ లేదన్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లారు. ఆక్కడ ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కూడా రావడం లేదు. అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్న తిరుపతి సభలో పాల్గొంటానని ప్రకటించారు.

అయితే తాను వస్తే చెవిరెడ్డి, పెద్ది రెడ్డి వంటి వైసీపీ నేతలు దాడులు చేయిస్తారని అందుకే వర్చువల్‌గా పాల్గొంటానని గురువారం ప్రకటించారు. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తిరుపతి విమానంలో ఆయన కూడా వచ్చారు. ఆయన రాక గురించి అతి కొద్ది మంది జేఏసీ నేతలకే సమాచారం ఉంది. అమరావతి మహోద్యమ వేదికపై అన్నిపార్టీల నేతలు ఉన్నారు. అమరావతిని వ్యతిరేకిస్తున్న ఒక్క వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రమే లేదు. ఆ లోటును ఎంపీ రఘురామకృష్ణరాజు భర్తీ చేశారు. ఆయన రాకతో అధికారికంగా వైసీపీ ఎంపీ కూడాఉన్నట్లయింది.

దీంతో అమరావతి వేదికపై అన్ని పార్టీల నేతలు ఉన్నట్లయింది. రఘురామరాజు వ్యూహం వైసీపీ నేతలను కూడా ఇబ్బంది పెడుతోంది. ఆయన రారు అనుకున్నారు కానీ సరైన సమయంలో వచ్చి వైసీపీని ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు. సమయం చూసి వైసీపీని ఎంపీ ఇక్కట్లలో పెట్టారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అమరావతిసభకు చంద్రబాబు సహా మిగిలిన పార్టీల ముఖ్య నేతలంతా హాజరయ్యారు.ఓ రకంగా అన్ని పార్టీలు,.. ప్రజాసంఘాల ఏకాభిప్రాయం అమరావతికి ఉన్నట్లుగా స్పష్టమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close