“సిద్ధం” కావట్లేదు – చివరి సభ మళ్లీ వాయిదానా ?

సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలను అనుకున్న సమయానికి నిర్వహించడానికి వైసీపీ తంటాలు పడుతోంది. ప్రతీ సభను రెండు, మూడు సార్లు వాయిదా వేసుకుంటూ వస్తోంది. తాజాగా చివరి సిద్ధం సభను… గత నెలలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పుడు తేదీలకు తేదీలు మార్చుకుంటూ వస్తున్నారు. ఈ నెల పదో తేదీన నిర్వహించాలనుకుంటున్న సిద్ధ సభపై.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ఎఫెక్ట్ పడినట్లుగా కనిపిస్తోంది. మరో తొమ్మిది రోజులు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అద్దంకి దగ్గర ఏర్పాట్లను సభ కోసం ఇప్పటికే పూర్తి చేశారు. పదిహేను లక్షల మంది వస్తారంటూ.. విజయసాయిరెడ్డి రెండు రోజులకో సారి మీడియాను పిలిచి చెబుతున్నారు. కానీ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో 19వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. చివరి సిద్ధం సభలోనే అభ్యర్థుల ప్రకటన.. మేనిఫెస్టోను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఆ కసరత్తు కూడా పూర్తి కాలేదు. డబ్బుల్లేక చేయూత బటన్ నొక్కినా పధ్నాలుగు రోజుల పాటు అకౌంట్లలో పడతాయని కథలు చెబుతున్నారు. చాలా పథకాలకు డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొత్త పథకాలు ప్రకటిస్తే నవ్వుల పాలవుతారని తెలుసు. అందుకే మోడీ దగ్గరకు వెళ్లి హామీ తీసుకుని వచ్చి ప్రకటన చేయాలనుకున్నారు..కానీ అదీ సాధ్యం కావడంలేదు.

జగన్ ఎన్నికల ప్రచారం కూడా తేలిపోతోంది. విపక్షాలు జోరుగా ప్రజల్లోకి వెళ్తూంటే.. బటన్ నొక్కుడు సభల్లో … విపక్షాలపై ఏడవడానికే జగన్ కు సమయం సరిపోతోంది. ఎన్నికల షెడ్యూల్ మరో వారం రోజుల్లో రానుంది. ఆ తర్వాత నెల రోజుల్లోనే పోలింగ్ ఉంటుంది. ఈ లోపు ఆయన ముప్పై నియోజకవర్గాలను అయినా కవర్ చేస్తారా లేదా అన్నది సందేహంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close