ఒక్క ఓటుకు మూడు రాష్ట్రాలు చేస్తున్న వైసీపీ

వైసీపీకి ఒక్క ఓటు వేసినందుకు విభజిత ఏపీని మూడు రాష్ట్రాలు చేసేస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో చివరికి ప్రత్యేక రాష్ట్రం అనే నినాదానికి వచ్చేశారు. ఇప్పటికే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదనను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రలోనూ ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎలాగైనా మనసుల్లో ప్రత్యేక రాష్ట్రం అనే బీజం నాటారంటే.. రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు వాటిని పెంచుకునే నేతలు ఉంటూనే ఉంటారు. అందుకే.. ఒక్క సారి ఓటు వేసినందుకు.. వైసీపీ .. విభజన ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయడానికి పునాదులు వేసేసినట్లయింది.

తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని టీడీపీ నడిపింది. అమరావతి రాజధానిని ఏకగ్రీవంగా అందరితో ఆమోదింప చేసి నిర్మాణం ప్రారంభించారు. ప్రతీ ప్రాంతానికి పరిశ్రమలు, అభివృద్ధి వికేంద్రీకరించింది. ఒక్క చోట ప్రాంతీయ ఉద్యమం రాలేదు. కానీ ఘనత వహించిన వైసీపీ అధినేత సీఎం జగన్ కాగానే.. ప్రాంతీయ ఉద్యమాగల చిచ్చు పెట్టారు. ఎవరూ అడగకపోయినా..మూడు రాజధానులు ప్రకటించేశారు. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. ఈ మూడు రాజధానులకు అభివృద్ధికి సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు.. వైసీపీ చెప్పదు.. కానీ మూడు రాజధానులు అడ్డుకున్నారంటూ విద్వేషాలు మాత్రం పెంచుతున్నారు.

ఎలా చూసినా ప్రాంతీయ ఉద్యమాలు భవిష్యత్ లో ఏపీని రావణ కాష్టం చేయడం ఖాయంగా కనపిస్తోంది. అధికారం అందని పార్టీలు వీటిని అందుకుంటాయి. అందులో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడే వైజ్ గా ఆలోచించాలి. రాయలసీమ.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ష్రాలను ఏర్పాటు చేయాలి.కోస్తా ప్రాంత వాసుల ప్రత్యేక రాష్ట్రం అడగకపోయినా విడిపోతామంటే..కలిసి ఉండాలని వారు ఉద్యమాలు చేయరు. అందుకే ఒక్క ఓటుతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనతను దక్కించుకోవాలంటే.. వైసీపీకి ఒక్కటే మార్గం.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం. అది చేసేస్తే.. పతనం సంపూర్ణం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close