మీ వెనుక నేనున్నా.. దూకుడు పెంచండి..! : జగన్

“మీ వెనుక సీఎం ఉన్నాడ”ని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. అక్రమ ఇసుక, మద్యం స్మగ్లింగ్ వంటి విషయాల్లో… అధికారులు కఠినంగా వ్యవహిరంచాలని.. ఎలాంటి వారు ఉన్నా వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. సీఎం మీతో ఉన్నారని, ఈ విషయంలో మీరంతా దూకుడుగా ముందుకెళ్లాలని మద్యం, ఇసుక అక్రమ రవాణాపై కూడా ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పద్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నామని, షాక్‌ కొట్టే రీతిలో మద్యం రేట్లు పెంచామని సీఎంగుర్తుచేశారు. ఇన్ని చేస్తున్న చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలన్సిన అవసరం ఉందన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా జరగకూడదని తేల్చి చెప్పారు. ఏపీలో కొద్ది రోజులుగా ఇసుకతో పాటు మద్యం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో సరిహద్దుల్లో తెలగాణ,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆయారాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం ఏపీలోకి వస్తోంది. ఈ మేరకు వందల కేసులు నమోదవుతున్నాయి. పట్టుబడ్డవి కాకుండా.. పెద్ద ఎత్తున ఏపీలోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ మద్య నియంత్రణ లక్ష్యం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

అలాగే ఇసుక కొరత కూడా.. ఏపీ ప్రజల్ని వెంటాడుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా.. ఇసుక విషయంలో విమర్శలు చేస్తున్నారు. దీంతో.. దీనిపైనా దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. అధికారంలో ఉన్నందున ఇలాంటి వాటిలో వైసీపీ నేతల ప్రమేయం ఎక్కువగా ఉందని విమర్శలొస్తున్నందున.. అధికారులకు..తానున్నానని జగన్ భరోసా ఇచ్చి కట్టడి చేయమని సూచించినట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close