ఆంధ్రప్రదేశ్ ఆస్తుల అమ్మకం ప్రారంభం..!

బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ఆస్తులను తెగనమ్మాసని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొదటగా విశాఖ, గుంటూరుల్లోని అత్యంత ఖరీదైన స్థలాలను వేలానికి పెట్టింది. ఈ భూముల అమ్మి.. సొమ్ము చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను సృష్టించిన ఏపీ సర్కార్..   నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ తో ఒప్పందం చేసుకుని అమ్మకాల్లో కమిషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. అమ్మి పెట్టాలంటూ..ఈ కంపెనీకి విశాఖ, గుంటూరుల్లోని 18.8 ఎకరాలను అప్పగించారు. వీటి విలువను రూ. 209 కోట్లుగా నిర్ణయించారు.

గుంటూరులో మార్కెట్.. విశాఖలో పోలీస్ క్వార్టర్స్ వేలం..!  

గుంటురు, విశాఖల్లో అమ్ముతున్న భూములు నిరుపయోగంగా ఉన్నవి కావు. సిటీ మధ్యలో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తున్న భూములు. గుంటూరు పట్టణంలో చిన్న మార్కెట్ అంటే.. తెలియని వారు ఉండరు. కొన్ని వందల మంది అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది గుంటూరు కార్పొరేష‌న్ పరిధిలో ఉంది. ఆ చిన్న మార్కెట్‌ను.. అమ్మేస్తున్నారు. అలాగే గుంటూరు శివారు నల్లపాడులో మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉన్న ఆరు ఎకరాల భూమిని… శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్మిక శాఖకు చెందిన మరో ఐదున్నర ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు.  విశాఖలో.. ఏకంగా పోలీస్ క్వార్టర్స్‌నే అమ్మకానికి పెట్టారు. వినియోగం లేక పాతబడిపోవడంతో.. అవి ఉపయోగం లేవన్న కారణం చూపి.. అమ్మకానికి పెట్టేశారు. ఇది బీచ్‌రోడ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. విశాఖలో పలు చోట్ల ఉన్న ఖరీదైన భూముల్ని అమ్మకానికి పెడుతున్నారు. అన్ని భూముల్ని రూ. రెండు వందల కోట్లుగా నిర్ణయించినప్పటికీ.. వేలంలో రూ. మూడు వందల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

సంక్షేమానికి అప్పులు – అభివృద్ధికి ఆస్తుల అమ్మకం..!
 
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వాటితో పాటు.. స్కూళ్లు, ఆస్పత్రులను నాడు, నేడు పేరుతో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. వీటన్నింటికీ నిధులు కావాలి. అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరుల్ని సమీకరించి… ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వనరులు అంటే.. అప్పులే. అవకాశం ఉన్న ప్రతీ చోటా అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్… నగదుపంపిణీ పథకాలకు ఖర్చు పెడుతోంది. అభివృద్ధి పనుల కోసం ఇప్పుడు.. ప్రజా వినియోగంలో ఉన్న భూములను అమ్మకానికి పెడుతోంది. ఇది ఆరంభమే.. ప్రభుత్వం యూనివర్శిటీల స్థలాలు సహా.. అనేకం అమ్మకాల జాబితాలో పెట్టుకుంది.
 
ఈ పరిస్థితుల్లో కొనుగోలు డిమాండ్ ఉంటుందా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భూముల్ని అమ్మి వేల కోట్లు ప్రభుత్వానికి జమ చేశారు. అయితే అప్పుడు హైదరాబాద్‌లో రియల్ భూమ్ ఉంది. చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడంతో కావాల్సినంత వనరులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ను వైఎస్ పెంచారు. కానీ ఏపీలో అన్నీ తిరోగమనంలో ఉన్నాయి. రాజధాని ఏదో క్లారిటీ లేకుండా  పోయింది. అమరావతిని నిర్వీర్యం చేశారు.ఇలాంటి సమయంలో.. భూములపై వందల కోట్లు పెట్టుబడులు ఎవరైనా పెడతారా అన్నది సందేహమే. ఎలాంటిస్పందన ఉంటుందన్నదివేలంలో మాత్రమే తేలుతుంది… 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close