ఆలయాలపై దాడుల ఘటనల్లో బీజేపీనీ టార్గెట్ చేస్తున్న సీఎం జగన్..!

ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ నేతలు ఇప్పటివరకూ బీజేపీని టార్గెట్ చేయలేదు. టీడీపీపైనే విరుచుకుపడుతున్నారు. బీజేపీని అనలేని నిస్సహాయతో.. రాజకీయ వ్యూహమో కానీ.. ఇప్పటి వరకూ.. వారు బీజేపీపై ఆరోపణలు చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. టీడీపీపైనే విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో.. ఇతరులు… అలాంటి ఘటనలు జరిగితే.. బీజేపీకే లాభం కాబట్టి… అంటూ.. ఆ దిశగా కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు. అయితే అమ్మఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ వ్యూహం మార్చారు. పరోక్షంగా బీజేపీని కూడా టార్గెట్ చేశారు.

జనసంచారం లేనిచోట విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేస్తున్నారో.. ఆ తరువాత అక్కడికి ఎందుకు వెళ్తున్నారో … రథాలు తగులబెట్టి.. మళ్లీ రథయాత్ర పేరుతో ఎందుకు వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రథయాత్ర చేయబోతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చింది. రామతీర్థం నుంచి ప్రారంభించి.. ఆలయాలపై దాడులు జరిగిన అన్ని చోట్లకూ వెళ్లాలని అనుకుంటున్నారు. పదిహేడో తేదీన రూట్ మ్యాప్ ఖరారు చేయాలనకుంటున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీని కూడా కలిపి విమర్శిస్తున్నారన్న చర్చ ప్రారంభమయింది.

పథకాలు ప్రారంభిస్తున్నప్పుడు ముందో తర్వాతో.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు ప్రపంచం దృష్టికి రాకూడదనే పథకాలు ప్రారంభించినప్పుడల్లా అలజడి సృష్టిస్తున్నారని.. దేవాలయాలపై దాడులు ఇందులో భాగమేనని సీఎం ఆరోపించారు. ఆలయ భూములు కాజేసిందెవరో.. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిందెవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి… వారికి బుద్ది చెప్పాలన్నారు. ద్రబాబు, లోకేష్‌కు ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు.

అమ్మఒడి పథకంలో వచ్చే ఏడాది నుంచి వినూత్నమైన మార్పు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకూ ఉండే విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు వద్దనుకునే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరిపామని… పద్దెనిమిది వేలు చేసే ల్యాప్ ట్యాప్‌ల్ని.. పదిహేను వేలకే ఇప్పిస్తామని.. సర్వీస్ కూడా.. ఉచితంగా చేయిస్తామిని హామీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close