వైసీపీ మేనిఫెస్టోనే దిక్సూచీ..! కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ దిశానిర్దేశం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో… ప్రతి అధికారి వద్ద ఉండాలని..దానికి తగ్గట్లుగానే పనితీరు మెరుగుపరుచుకోవాలని అధికార యంత్రాంగానికి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో…జగన్మోహన్ రెడ్డి భిన్నంగా వ్యవహరించారు. తన ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. గుడ్ పోలీసింగ్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిందికాదని ఎత్తిపొడిచారు. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, ఎమ్మార్వోపై .. టీడీపీ ఎమ్మెల్యే జులుం వంటి అంశాలను సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుడ్ పోలీసింగ్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉండకూడదో.. భవిష్యత్తులో ఎలా ఉండాలో జగన్ అధికార యంత్రాంగానికి వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఘటనలను సీఎం ఉదాహరణలుగా చెప్పారు. కృష్ణాజిల్లాలో ఇసుక తవ్వకాలు ఆపినందుకు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం, గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్, షాపులు, థియేటర్స్ వద్ద ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం, రాజధానిలో బలవంతంగా భూములు లాక్కోవడం వల్ల 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలతోపాటు బెజవాడలో కాల్ మనీ కేసులు ఇవన్నీ చూస్తే మంచి పోలీసింగ్ అని ఎలా అనిపించుకుంటుందని నిలదీశారు. క్లబ్ లు, జూదం, బెట్టింగ్ లు యథేచ్ఛగా నిర్వహించారని ఆయన గుర్తుచేస్తూ ఇటువంటివన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపైనే ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా, ఎంతటివారైనా సరే అవినీతి పనులు, లూటీలు, అక్రమాలు చేయమని మీ దగ్గరకు సిఫార్సు కోసం వస్తే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని సీఎం జగన్.. ఎస్పీలను ఆదేశించారు.

ఎమ్మెల్యేలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నేరుగా అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎన్నుకున్నవారిని మీ వద్దకొస్తే వారిని చిరునవ్వుతోనే పలకరించి సమస్యను అడిగి తెలుసుకోవాలని, నిబంధనల ప్రకారం ఉంటే ఆ పని చేయాలని, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. కలెక్టర్ల మాదిరిగా జిల్లాల ఎస్పీలు కూడా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందేనని, గ్రామాలకు వెళ్లి బలహీనవర్గాల కాలనీల్లో నిద్రించాలని, ప్రజల స్పందనను స్వయంగా మీరే తెలుసుకోవాలని కోరారు. అవినీతి, అక్రమాలు చేయమని ఎవరైన చెపితే వారి మాట వినొద్దని సీఎం జగన్.. అధికారులకు భరోసా కల్పించారు. తాను కూడా ఇటువంటి వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close