సలాం కుటుంబానికి జగన్ ఓదార్పు..!

కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు వెళ్లిన జగన్.. సలాం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించారు. వారికి గతంలో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సలాం భార్యా, పిల్లలతో పాటు అందరూ చనిపోవడంతో… సలాం అత్తకు రూ. ఇరవై లక్షల నష్టపరిహారం చెక్కును అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పట్లో తీసుకోలేదు. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూ. పాతిక లక్షల చెక్‌ను అందించారు. సలాం కుటుంబ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

ఆ తర్వాత సలాం అత్త కొన్ని విజ్ఞప్తులను జగన్‌కు చేశారు. తన మరో కుమార్తెకు ఔట్‌ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇవ్వాలని..అనంతపురంలో ఉద్యోగం చేస్తున్న అల్లుడిని నంద్యాలకు బదిలీ చేయాలని కోరారు. వెంటనే.. ఆ విజ్ఞప్తులను పరిష్కరించాలని జగన్ అధికారులను ఆదేశించారు. సలాం అత్త కుటుంబానికి అండగా ఉండాలని అక్కడిక్కడే ఎస్పీ ఫక్కీరప్పను జగన్ ఆదేశించారు. సలాం కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వారి వాంగ్మూలం వీడియో బయటకు వచ్చింది. దాంతో రాజకీయంగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.

మైనార్టీల్లో ఈ వ్యవహారం అలజడి రేపడంతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. తానే స్వయంగా సలాం కుటంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసుల్ని అరెస్ట్ చేయించారు. వారు బెయిల్ పై వచ్చినందున .. బెయిల్ రద్దు చేయించేందుకు పిటిషన్లు వేయించారు. జగన్ చర్యలతో ముస్లింలు సంతృప్తి పడతారని వైసీపీ వర్గాలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close