జగన్ బాయ్‌కాట్ నిర్ణయంపై వైసీపీ కార్యకర్తల అసంతృప్తి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవకూడదని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయన సొంతపార్టీలోని కోస్తాప్రాంత కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అనేది అందరిదీ అని, ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటంవలన వైసీపీ పార్టీ ప్రజలకు దూరమైపోతుందని వారు భావిస్తున్నారు. అసలు విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి జగన్ వ్యతిరేకించటం వలనే ఇటీవల జగన్ దీక్షకు మద్దతు పెద్దగా లభించలేదని, ఇప్పుడు ఈ బాయ్‌కాట్ నిర్ణయం వలన వ్యతిరేకత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. జగన్‌ను కలిసి నిర్ణయాన్ని మార్చుకోమని అడుగుదామని కొందరు భావిస్తున్నారు.

నూతన రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రాంతంలో నిర్మించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకించలేదని రాయలసీమలోని వైసీపీ శ్రేణులలో జగన్‌పై ఇప్పటికే అసంతృప్తి బలంగా ఉంది. ఆ కారణంగానే జగన్ ఇటీవల గుంటూరులో చేసిన దీక్షకు రాయలసీమలో స్పందన కొరవడింది. ఇటు కోస్తాలోనేమో బాయ్‌కాట్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తమవటం… మొత్తం మీద చూస్తే వైసీపీలో రెండుప్రాంతాలలోనూ అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి జగన్ దీనిని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close