యురేకా.. వైవీ సుబ్బారెడ్డికి ఒక పాయింట్ దొరికింది..!

పార్ల‌మెంటులో టీడీపీ ప్రవేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీ చ‌ర్చ జ‌రుగుతోంది! ఆంధ్రాకి చేసిన సాయం విష‌యంలో కేంద్రం చేసుకుంటున్న ప్ర‌చారం, విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం రావాల్సిన ప్ర‌యోజనాల లెక్క‌ల‌పై టీడీపీ ఎంపీలు గ‌ల్లా జయదేవ్‌, రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌ధానిని నిల‌దీశారు. స‌రే, ఈ చ‌ర్చ‌లో పాల్గొనే అవ‌కాశాన్ని చేజేతులా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జార‌విడుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు హాజ‌రుకాలేని వైకాపా ఎంపీలు, స‌భ‌లో ఏపీ ప్ర‌యోజ‌నాల‌పై జ‌రుగుతున్న చ‌ర్చ తీరును రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోణం నుంచి కాకుండా… రాజకీయ ల‌బ్ధి నుంచి మాత్రమే చూస్తున్నారు..! పార్ల‌మెంటులో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ప్ర‌సంగంపై విశ్లేష‌ణ‌కు దిగారు ప్ర‌త్యేక హోదా కోసం ప‌ద‌వుల్ని రాజీనామాలు చేసిన ఎంపీల్లో ఒక‌రైన వైవీ సుబ్బారెడ్డి..!

టీడీపీ, భాజ‌పా లోప‌యికారీ ఒప్పందం గురించి, ఆ రెండు పార్టీల బంధం గురించి తాము మొద‌ట్నుంచీ చెబుతూ వ‌స్తున్న‌దే నిజ‌మైంద‌ని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొల‌గినా కూడా ఏపీ సీఎం మిత్రుడే అని రాజ్ నాథ్ చెప్ప‌డ‌మే ఆ రెండు పార్టీల లోప‌యికారీ ఒప్పందానికి సాక్ష్య‌మ‌ని వైవీ సుబ్బారెడ్డి చెప్ప‌డం జ‌రిగింది! కేంద్ర హోం మంత్రి వ్యాఖ్య‌ల్లో టీడీపీ నాట‌కం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. అంతేకాదు, రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతున్నంత‌సేపూ తెలుగుదేశం ఎంపీలు క‌నీసం నిర‌స‌న తెలిపే ప్ర‌య‌త్నం కూడా చెయ్య‌లేద‌ని, వింటూ అలా కూర్చునే ఉన్నార‌ని త‌ప్పుబ‌ట్టారు. భాజ‌పాతో బంధం కొన‌సాగుతోంది కాబ‌ట్టే, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లలేద‌ని వైవీ విమ‌ర్శించారు.

‘చంద్ర‌బాబు నాయుడు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కి వెళ్లి మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజ‌కీయాలు ఎలా ఉన్నా ఆయ‌న త‌మ‌కు స్నేహితుడు’అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. అయితే, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కి వెళ్లి మోడీపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే మాట‌ను వైవీ సుబ్బారెడ్డి ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం! వారికి విమ‌ర్శించ‌డానికి అనుకూల‌మైన వాక్యాల‌ను మాత్ర‌మే సంగ్ర‌హించ‌డం జ‌రిగింద‌న్న‌మాట‌! ఇక‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్ల‌క‌పోవ‌డం భాజ‌పాతో లోప‌యికారీ ఒప్పందానికి సాక్ష్య‌మ‌న్నారు. నిజానికి, ఈ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి ఢిల్లీ వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంటుంది..? పార్ల‌మెంటులో మాట్లాడాల్సింది ఎంపీలు, ఆ ప‌ని వారు ఎలాగూ చూస్తున్నారు. వారికి దిశానిర్దేశం స‌హ‌జంగానే ముఖ్య‌మంత్రి నుంచి వెళ్తుంది! సరే, ఈ లాజిక్ ప్ర‌కారం చూసుకుంటే… గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లో బాగా పోరాడామని వైకాపా ఎంపీలు చెప్పుకున్నారు కదా. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌లేదే..? ఈ లాజిక్ ప్ర‌కారం అప్పుడు భాజ‌పాతో జ‌గ‌న్ లోప‌యికారీ రాజ‌కీయం చేశారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close