బీజేపీ మూడో జాబితా – జనసేన సీట్లపై ఏదీ స్పష్టత ?

తెలంగాణ బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారందరికీ టిక్కెట్లు కేటాయించారు. కానీ ఈ జాబితా చూస్తే.. జనసేన పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై సొంత పార్టీలోనే సెగ ఉందని స్పష్టమైంది. గ్రేటర్ పరిధిలో టిక్కెట్లను ప్రకటించడానికి తంటాలు పడుతున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి టిక్కెట్లను జనసేనకు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ సీట్లను జనసేనకు ఇస్తే తన దారి తాను చూసుకుంటానని.. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తేల్చేశారు.

అలాగే జనసేనకు కేటాయించాల్సిన అన్ని సీట్ల విషయంలోనూ పేచీలు ఉన్నాయి. దీంతో జాబితా ప్రకటించలేదు. తాజాగా ప్రకటించిన 35 మంది జాబితాలో మూడో జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు బాబూమోహన్ పేరు కూడా ఉంది. తనను అవమనించారని ఆయన మూడు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి ఆరపించారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎప్పుడూ పోటీ చేసే నియోజకవర్గం అంబర్ పేట నుంచి ఈ సారి ఆయన పోటీ చేయడం లేదు. మాజీ మంత్రి క్రిష్ణాయాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు. మర్రి శశిధర్ రెడ్డి కి సనత్ నగర్ టిక్కెట్ కేటాయించారు. ఈ జాబితాలో పలువురు ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు ఉన్నారు. మాజీ జర్నలిస్టు సంగప్పకు.. నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కేటాయించారు.

పలువురు సీనియర్లు పోటీకి వెనుకాడుతూండటంతో.. అభ్యర్థులను ఖరారు చేయడం బీజేపీ పెద్దలకు సమస్యగా మారింది. మొదటి జాబితాలో 52, రెండో జాబితాలో ఒక్క పేరు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మరో 35 పేర్లను ఖరారు చేశారు. మొత్తంగా 88 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా 31 సీట్లకు పెండింగ్ ఉన్నాయి. వీటిలోనే జనసేనకు సర్దుబాటు చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close