ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఏడాది అయింది. గత ఏడాది జూన్ పన్నెండో తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటికి వారిపై గురుతరమైన బాధ్యత ఉంది. ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పిచ్చారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రాన్ని గాడినా పెట్టాలని వారు నేరుగా సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి ఐదేళ్లుగా వారు నానా విధాలుగా దోపిడీకి గురయ్యారు. చివరికి నకిలీ మద్యంతో ఆరోగ్యాన్నీ దోచుకున్నారు. అన్నీ కరెక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టారు.
ఏడాదిలో సమూల మార్పులు
వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిన జగన్ రెడ్డి పాలనా నిర్వాకాలను కరెక్ట్ చేసి దారిలో పెట్టడం అంత తేలిక కాదు. తన దోపిడీకి సహకరించేవారిని కమిషన్లు ఇచ్చి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అవినీతి వర్గాన్ని తయారు చేసుకున్నారు జగన్. అలాంటి వారిని కదిలించి.. వ్యవస్థల్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొదట్లో క్లిష్టంగా ఉన్నా రాను రాను మార్చుకుంటూ వచ్చారు. మద్యం విధానాన్ని మార్చారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేలా.. క్వాలిటీ, అంతర్జాతీయ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. అధికారుల్లో అలసత్వం.. పోలీస్ వ్యవస్థలో జడత్వాన్ని తొలగించారు. ఇప్పుడు సాధారణ పరిపాలన జరుగుతోంది. ఎవరి పని వారు సిన్సియర్గా చేసుకుంటున్నారు.
మెరుగుపడ్డ మౌలిక సదుపాయాలు
వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కరవయ్యాయి. కేవలం ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయడమే తమ టార్గెట్ గా పెట్టుకుని.. అన్ని పథకాలను..పనులను ఆపేశారు. చివరికి రోడ్లపై గుంతలు పడితే పూడ్చలేకపోయారు. ఐదు సంవత్సరాల్లో రోడ్లన్నీ నాశనం అయిపోయాయి. కూటమి ప్రభుత్వం రాగానే ముందు రోడ్లన్నీ బాగు చేయించే మిషన్ ప్రారంభించారు. ఇప్పటికి గ్రామీణ ప్రాంత రోడ్లతో సహా చాలా వరకూ పూర్తి చేశారు. ప్రజల ప్రయాణాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక ఇంటింటికి నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ సహా అనేక ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇతర పథకాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడు మౌలిక సదుపాయాల. సమస్యలు లేకుండా ఉన్నారు.
పరుగులు పెడుతున్న అమరావతి, అభివృద్ధి పనులు
ఖజానాను అప్పుల పాలు చేసి.. వెళ్లిన జగన్ రెడ్డి నిర్వాకంతో.. మరో నాలుగైదేళ్ల పాటు ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది . కానీ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పరిస్థితిని వేగంగా చక్కదిద్దారు. అమరావతిని తెరపైకి తెచ్చారు. పనులు ప్రారంభించారు. ఇప్పుడు అరవై వేల కోట్లకుపైగా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పనుల ఊపందుకున్నాయి. పోలవరం నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. నియోజకవర్గ గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు పనులు చేయించగలుగుతున్నారు.
అమల్లోకి ఆకలి తీర్చే సంక్షేమం
ఓటు బ్యాంక్ దృష్టితో నగదు బదిలీ పథకాలను అమలు చేయడం కాదు.. పూర్తి స్థాయిలో ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం, సాయం అవసరమైన వారికి సాయం. చేయడం అసలైన సంక్షేమం. అలా చేయడం వల్లనే పథకాల డబ్బులకు న్యాయం చేసినట్లవుతుంది. టీడీపీ అధికారంలోకి రాగానే.. పండుటాకులకు పెన్షన్ పెంచారు. ఇప్పుడు ప్రతి నెలా నాలుగు వేలు అందుతోంది. అంటే ఏడాదికి నలభై ఎనిమిది వేలు వారికి అందాయి. అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. ఈ రోజే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందిస్తున్నారు.
ప్రజలు అధికారం ఇచ్చింది అనుభవించడానికి.. దోచుకోవడానికి అన్నట్లుగా ఉన్న పాలనకు.. ప్రజల కోసమే అన్నట్లుగా ఉన్న పాలనకు.. ఏడాదిలోనే స్పష్టమైన తేడా కనిపించింది.