ఏపీ ప్రభుత్వ పొదుపు మాటల్లోనేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం… గత అధికార పక్షం మీద అదే పనిగా ఆరోపణల్లో ప్రధానమైనది… దుబారా ఖర్చు. టీడీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం పెట్టినా.. అది దుబారా అని సాక్షి పత్రికలు కథనాలు మీద కథనాలు రాసేవారు. గత ఐదేళ్ల కాలంలో అదే జరిగింది. అందుకే… వైసీపీ గెలిచిన వెంటనే… ఆ పార్టీకి చెందిన నేతలు.. తమ ప్రభుత్వంలో దుబారా ఉండదని.. అంతా పారదర్శకంగా.. పొదుపుగా… ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించారు. కానీ… వారంలోనే… తమ మాటలకు.. చేతలకు పొంతన లేదని నిరూపించేశారు.

ఇఫ్తార్ విందుకి రూ. కోటికిపైగా ఖర్చా…?

రంజాన్ మాసం సందర్భంగా.. ప్రభుత్వం అధికారికంగా.. ఇఫ్తార్ విందు ఇవ్వడం… సంప్రదాయంగా వస్తోంది. ఐదారు వేల మందిని దీనికి పిలుపస్తారు. ఈ సారి గుంటూరులోని పరేడ్ గ్రౌండ్స్‌లో… నిర్వహించారు. అంటే.. అది ప్రభుత్వానిదే దానికేమీ ఖర్చు ఉండదు. కేవలం షామినాలు, విందు కోసం… ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీని కోసం… ప్రభుత్వం అధికారికంగా.. దాదాపుగా రూ. కోటికిపైగా నిధులు విడుదల చేసింది. విందుకు హాజరైన ఐదు వేల మందిని పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపుగా.. ఒక్కొక్కరి ఇఫ్తార్ విందుకు.. దాదాపుగా రూ. రెండు వేలు ఖర్చు చేసినట్లయింది. ఇది అసాధారణం.. అంత ఖర్చయ్యే అవకాశమే లేదు. అయినప్పటికీ.. అంత మొత్తం ఎందుకు విడుదల చేశారో.. ఎందుకు.. ఖర్చు పెట్టారో అధికారవర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇఫ్తార్‌కే రూ.కోటి ఖర్చయితే ప్రమాణస్వీకారానికి ఎంత ఖర్చయి ఉండాలి..?

ప్రభుత్వం తరపున అధికారికంగా.. చాలా పరిమిత కార్యక్రమంగా నిర్వహించిన ఇఫ్తార్ విందుకే.. దాదాపుగా రూ. కోటి ఖర్చు పెట్టినట్లుగా ప్రభుత్వ వర్గాలు జీవో జారీ చేస్తే.. అత్యంత అట్టహాసంగా జరిగినా… ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఇంకెంత ఖర్చయి ఉంటాయన్న చర్చలు సహజంగానే రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి. ప్రమాణస్వీకారానికి అధికారికా ఆహ్వానితులే దాదాపుగా… పదిహేను వేల మంది ఉన్నారు. ఇందులో వీఐపీలే… ఐదారు వేల మంది ఉన్నట్లుగా సమాచారం. వారికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికే కోట్లు ఖర్చవుతుంది. ఈ వివరాలు మొత్తం ప్రభుత్వం బయటపెట్టాల్సి ఉంది.

పొదుపు మాటల్లో కాదు.. చేతల్లో చూపరా..?

తాము అత్యంత నిరాడంబరంగా… పరిపాలన సాగిస్తామని… విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో గతంలోనే ప్రకటించారు. అందుకే సాక్ష్యంగా.. ఆయన … తాము ఇక హిమాలయ వాటర్ బాటిళ్లు వాడబోమని.. ప్రకటించారు. అదే నిరాడంబరతకు… పొదుపునకు… సాక్ష్యం అయితే.. మరి మిగతా విషయాల్లో ఎందుకంత పొదుపు పాటించరు..! అసలు ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్తే తప్ప జీతాలివ్వలేని పరిస్థితి ఉందని తెలిసి కూడా.. ఎందుకు ఖర్చులు నియంత్రించలేకపోతున్నారు..? దుబారా అధికంగా ఉందని తెలిసి కూడా.. ఎందుకు .. గత ప్రభుత్వంలానే చేస్తున్నారు.. ? ఈ విషయంలో ప్రజల అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత వైసీపీ నేతలదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close