దివాలా అంచున ఏపీ..! 4 రోజులా..? 14 రోజులా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కీలకమైన దశకు చేరుకుంది. దిన దిన గండం నూరేళ్లాయుష్షు అనే పరిస్థితి చాలా కాలంగా ఉన్నప్పటికీ.. గత రెండు నెలల నుంచి పరిస్థితి మరీ టైట్‌గా మారింది. జీతాల కోసం ఆర్బీఐ వద్ద బాండ్ల వేలం వేసిన ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. అవడానికి అప్పు అయిందికానీ ఆ నిధులు రాలేదు. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ ఉండటంతో ఆ అప్పు నిధులను ఆర్బీఐ జమ చేసుకుంది. లోటు కింద కేంద్రం విడుదల చేసిన మరో 1400కోట్ల నిధులనూ అలాగే జమ చేసుకోవడంతో మరిన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పెండింగ్ జీతాలు.. పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. రోజువారీ ఆదాయాన్ని వచ్చినంత వరకూ పంపిణీ చేస్తోంది. కానీ ఇప్పటికీ చాలా మందికి వేతనాలు, పెన్షన్లు పడలేదు.

ఆర్బీఐ నుంచి ఏ ప్రభుత్వం తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ ఇంకా రూ. ఎనిమిది వందల కోట్లు చెల్లించాల్సి ఉంది. జీతాలు.. ఇతర అవసరాల కోసం మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ..దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే… తాత్కాలికంగా ఆర్థిక అవసరం తీర్చుకునే ప్రక్రియ మాత్రమే. పధ్నాలుగు వందల కోట్ల కన్నా ఎక్కువ ఓడీ తీసుకుంటే నాలుగు రోజుల్లో తిరిగి చెల్లించారు. పధ్నాలుగు వందల కోట్ల కన్నా తక్కువ తీసుకుంటే.. ఆ గడువు పధ్నాలుగు రోజులు. సహజంగా ఆర్బీఐ.. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓడీ సౌకర్యాన్ని వినియోగించుకుంటే… ఆ రాష్ట్ర ఖాతాలో ఉన్న నిధుల్ని ఆ రోజుల్లోపు మినహాయించుకుంటుంది. దీనికి వడ్డీ కూడా వసూలు చేస్తుంది .. అది వేరే విషయం. ఒక వేళ .. ఆ లోపు.. ఆ రాష్ట్ర ఖాతాలో నిధుల్లేకపోతే ఏం చేస్తుంది..? . ఆ రాష్ట్రం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ ఈ ముంపులోనే ఉంది. ఇప్పటికే ఎనిమిది వందల కోట్లు కట్టాల్సి ఉంది. మళ్లీ ఓడీ తేసుకుంటే.. ఆదాయ మార్గం లేదు.

ఓ వైపు ఏపీ ప్రభుత్వం 41వేల కోట్ల రూపాయల్ని అడ్డగోలుగా తరలించిందని… ఎవరికి చెల్లించారో… కనీసం బిల్లులు కూడా లేకుండా చెల్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సాక్షాత్తూ అకౌంటెంట్ జనరలే ఈ విషయాన్ని లేఖ ద్వారా వెల్లడించారు. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితి రావడం.. ప్రభుత్వ పెద్దల్ని కలవర పరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ఏం చేయాలన్నదానిపై వైసీపీలో చర్చలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మనీతో గేమ్స్ అంత మంచిది కాదని ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెద్దలకు తెలుస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close