న‌క్కిన త్రినాథ‌రావు… మ‌రో క్రేజీ ప్రాజెక్ట్!

‘ధ‌మాకా’తో సూప‌ర్ హిట్టు కొట్టాడు నక్కిన త్రినాథ‌రావు. ఆ సినిమాతో పెద్ద‌ నిర్మాత‌లు, స్టార్‌ హీరోల దృష్టి న‌క్కినపై ప‌డింది. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకొన్నాడు. ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాత‌. ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం’, ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ చిత్రాల‌తో నిర్మాత‌గా త‌న అభిరుచి చాటుకొన్నారు రాజేష్‌. ఇప్పుడు న‌రేష్‌తో ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ తీస్తున్నారు. ‘ఊరు పేరు భైర‌వ కోన‌’ ఫిబ్ర‌వ‌రి 9న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు న‌క్కిన త్రినాథ‌రావుకి ఆయ‌న అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఓ క‌థ సిద్ధం చేశారు. ఇటీవ‌లే స్టోరీ సిట్టింగ్స్ జ‌రిగాయి. స్క్రిప్టు దాదాపు ‘లాక్‌’ చేసేశారు.

ప్ర‌స్తుతం హీరో కోసం అన్వేష‌ణ‌లో ఉంది టీమ్. హీరోలుగా నాగ‌శౌర్య‌, శ్రీ‌విష్ణు పేర్లు వినిపించాయి. కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని తెలుస్తోంది. ఓ యూత్ హీరోతో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డం దాదాపుగా ఖాయం అయ్యింది. అంతా సెట్ అయితే ఈ సంక్రాంతి త‌ర‌వాత ప్రాజెక్ట్ వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. న‌క్కిన త్రినాథ‌రావు – ప్ర‌స‌న్న‌కుమార్ కాంబో అన‌గానే హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనర్లే గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా అదే జోన‌ర్‌లో ఉండ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close