ఏపీ పొత్తులపై ఢిల్లీలో ఏం జరుగుతోంది ?

టీడీపీ – బీజేపీ పొత్తు అంతర్గత వ్యవహారం.. అయినా కోరి దరిద్రాన్ని సంకలో పెట్టుకుంటారా అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో దీర్ఘాలు తీయడం…. అదీ కూడా జగన్‌తో ప్రధాని భేటీ ముగిసిన తర్వాత వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులకు స్పష్టమైన సూచికగా కనిపిస్ున్నాయి. ఏపీకి వచ్చిన అనురాగ్ ఠాకూర్ వైసీపీ సర్కార్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. దానికి వైసీపీ నుంచి కౌంటర్ అంటే.. జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ప్రధానితో కలవడమే. అక్కడ ఏం చర్చించారో తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.

ఏపీలో పొత్తుల రాజకీయాలు అంతర్గతంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని జనసేన పార్టీ ప్రకటిస్తోంది. ఆ పార్టీ ఓట్లు చీల్చబోమంటూ ప్రతిజ్ఞలు అలా చేయాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి. అంతకు మించి ఆప్షన్ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీకి దగ్గరతువుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంపై వైఎస్ఆర్‌సీపీకి కూడా క్లారిటీ ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

వైసీపీ తన వ్యవహారశైలితో బీజేపీకి కూడా దూరమైందని.. పరోక్ష సంబంధాలను కూడా పోగొట్టుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలు చిన్నవి కావు. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ వారి పాత్ర బయటపెడతామని చెబుతున్నారు. ఇప్పటికే అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైసీపీకి.. అదనంగా మారిన్ని కేసులు పడితే.. ఇబ్బందులు పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : క్రిమినల్ ఎప్పుడూ హీరో కాదని గుర్తుంచుకోండి !

" ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా...

పబ్లిక్ డిబేట్… మోడీ భయపడుతున్నారా..!?

అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ పార్టీ నేతలంతా ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే...

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close