కసి తీర్చుకోవాలంటే అంతే..! ధర్మకర్తని కూడా వదలరా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలనుకుంటే క్షణం కూడా ఆగదు. అటూ ఇటూ కూడా ఆలోచించదు. ఉన్న పళంగా జీవో జారీ చేసేస్తుంది. అది చెల్లుతుందా.. లేదా అన్నది తర్వాత సంగతి. రోజంతా సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయం ఘటనలో…ఎవరిపై కక్ష తీర్చుకోవాలా అని ఆలోచించి.. చివరికి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసుకుంది. ఎందుకంటే.. ఆయన రామతీర్థం ఆలయానికి అనువంశిక ధర్మకర్త. మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఆయనను తొలగించిన తర్వాత… ఆయనకు .. ఆయన కుటుంబం వేల ఎకరాలు ఇచ్చిన ఆలయాలపైన వారికి పెత్తనం లేకుండా చేశారు. అలాంటి సందర్భంలో.. ఏ ఆలయాలకు తాను ధర్మకర్తగా ఉన్నారో అశోక్ గజపతిరాజుకు కూడా తెలియని పరిస్థితి.

అయినప్పటికీ.. ఆయన రామతీర్థం ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారని.. ఆయనను తొలగిస్తున్నామని జీవో ఇచ్చేసింది. ఈ జీవోను చూసి.. టీడీపీ నేతలు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కళ్లు మూసుకుపోయి జీవోలు ఇస్తోందని అంటున్నారు. నిజానికి ధర్మకర్త.. ధర్మకర్తే. ఆయనకు ఎలాంటి విధులు.. ఉండవు. కానీ.. ధర్మకర్తగా ఉండి.. ఆయన ఆలయ నిర్వహణను పట్టించుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. అందుకే తొలగించామని చెబుతోంది.

ధర్మకర్తను బాధ్యుడిని చేసే ముందు.. ఆలయానికి సంబంధించిన అధికారులందర్నీ బాధ్యుల్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు.. కక్షతో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు.. రామతీర్థం ఆలయ బాధ్యలు బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒకటి చేసేయాలన్న కక్షతో.. ప్రభుత్వం ఉంటే ఇలాంటి జీవోలే బయటకు వస్తాయన్న చర్చ మాత్రం సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close