కాల్ మనీ నిందితుడు వైసీపీలో చేరగానే బీసీ ఉద్యమకారుడయ్యాడా..?

బుద్దా వెంకన్న సోదరుడు.. బుద్దా నాగేశ్వరరావు వైసీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యంత ఆప్యాయంగా.. గుండెలకు హత్తుకుని.. పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. జగన్ ఖాతాలో మరో విజయం పడిందని.. వైసీపీ నేతలు.. సాక్షి మీడియా సంబరాలు చేసుకున్నారు. బుద్దా నాగేశ్వరరావు.. బుద్దా వెంకన్నకన్నా.. గొప్ప నేత అని… బీసీల కోసం తెగ పోరాడేశారని కథలు .. కథలుగా సాక్షిలో రాసుకున్నంత పని చేశారు. నిజంగా బుద్దా నాగేశ్వరావు.. సాక్షిలో చెప్పినట్లుగా.. ప్రజానేతగా ఎదిగారా.. అంటే… దానికి పాత సాక్షి పత్రిక కథనాలే మనం రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది.

మూడేళ్ల కిందట… విజయవాడలో ఓ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసు కాల్ మనీ కేసు. వైసీపీ దీన్ని మరింత విస్తృత అర్థంలో “కాల్ మనీ – సెక్స్ రాకెట్‌”గా చెబుతూ ఉంటుంది. ఆ కేసు నిందితులంతా.. తెలుగుదేశం పార్టీ వాళ్లేనని కథలు కథలు గా ప్రచారం చేసింది. అందులో కీలక వ్యక్తి.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు.. బుద్దా నాగేశ్వరరావు. ఈ బుద్ధా నాగేశ్వరరావుపై.. అప్పట్లో సాక్షిలో లెక్క లేనన్ని కథనాలు వచ్చాయి. ఆయనను.. చంద్రబాబే కాపాడారని.. రాసుకొచ్చింది. ఆ సమయంలో… పోలీసులు.. ఈ బుద్దా నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఆయనపై కేసులు కూడా పెట్టారు. నిజానికి సోదరునితో బుద్దా వెంకన్నకు… సత్సంబంధాలు లేవని.. కుటుంబ పరంగా విడిపోయామని.. చాలా సార్లు వెంకన్న చెప్పినా సాక్షి పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ ఎమ్మెల్సీ సోదరుడు కాబట్టి… చల్లాల్సినంత బురద చల్లేశారు.

కానీ ఇప్పుడు… అదే బుద్దా నాగేశ్వరరావు… పరుగులు పెట్టుకుంటూ.. వైసీపీలో చేరతానని వస్తే… అంత కంటే అదృష్టం లేదన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… ఆయనను… అత్యంత గౌరవంగా తోడ్కొని జగన్ వద్దకు తీసుకెళ్లారు. జగన్ ఆయనకు కండువా కప్పి గొప్ప విజయం సాధించినట్లు ఫీలయ్యారు. కానీ.. తాము అంతకుముందు ఆయనపై చేసిన ఆరోపణలు.. కాల్ మనీ… సెక్స్ రాకెట్ వ్యవహారాల గురించి మాత్రం గుర్తుంచుకోలేకపోయారు. అంటే.. నేరస్తుడ్ని అయిన పార్టీలో చేర్చుకుని ఉండాలి లేకపోతే… తాము.. తమ పత్రిక చేసిన ఆరోపణలు తప్పయినా ఉండాలి. ఏది జరిగినా.. వైసీపీకి విలువలు లేవనే మాట మాత్రం స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close