కాల్ మనీ నిందితుడు వైసీపీలో చేరగానే బీసీ ఉద్యమకారుడయ్యాడా..?

బుద్దా వెంకన్న సోదరుడు.. బుద్దా నాగేశ్వరరావు వైసీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యంత ఆప్యాయంగా.. గుండెలకు హత్తుకుని.. పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. జగన్ ఖాతాలో మరో విజయం పడిందని.. వైసీపీ నేతలు.. సాక్షి మీడియా సంబరాలు చేసుకున్నారు. బుద్దా నాగేశ్వరరావు.. బుద్దా వెంకన్నకన్నా.. గొప్ప నేత అని… బీసీల కోసం తెగ పోరాడేశారని కథలు .. కథలుగా సాక్షిలో రాసుకున్నంత పని చేశారు. నిజంగా బుద్దా నాగేశ్వరావు.. సాక్షిలో చెప్పినట్లుగా.. ప్రజానేతగా ఎదిగారా.. అంటే… దానికి పాత సాక్షి పత్రిక కథనాలే మనం రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది.

మూడేళ్ల కిందట… విజయవాడలో ఓ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసు కాల్ మనీ కేసు. వైసీపీ దీన్ని మరింత విస్తృత అర్థంలో “కాల్ మనీ – సెక్స్ రాకెట్‌”గా చెబుతూ ఉంటుంది. ఆ కేసు నిందితులంతా.. తెలుగుదేశం పార్టీ వాళ్లేనని కథలు కథలు గా ప్రచారం చేసింది. అందులో కీలక వ్యక్తి.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు.. బుద్దా నాగేశ్వరరావు. ఈ బుద్ధా నాగేశ్వరరావుపై.. అప్పట్లో సాక్షిలో లెక్క లేనన్ని కథనాలు వచ్చాయి. ఆయనను.. చంద్రబాబే కాపాడారని.. రాసుకొచ్చింది. ఆ సమయంలో… పోలీసులు.. ఈ బుద్దా నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఆయనపై కేసులు కూడా పెట్టారు. నిజానికి సోదరునితో బుద్దా వెంకన్నకు… సత్సంబంధాలు లేవని.. కుటుంబ పరంగా విడిపోయామని.. చాలా సార్లు వెంకన్న చెప్పినా సాక్షి పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ ఎమ్మెల్సీ సోదరుడు కాబట్టి… చల్లాల్సినంత బురద చల్లేశారు.

కానీ ఇప్పుడు… అదే బుద్దా నాగేశ్వరరావు… పరుగులు పెట్టుకుంటూ.. వైసీపీలో చేరతానని వస్తే… అంత కంటే అదృష్టం లేదన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… ఆయనను… అత్యంత గౌరవంగా తోడ్కొని జగన్ వద్దకు తీసుకెళ్లారు. జగన్ ఆయనకు కండువా కప్పి గొప్ప విజయం సాధించినట్లు ఫీలయ్యారు. కానీ.. తాము అంతకుముందు ఆయనపై చేసిన ఆరోపణలు.. కాల్ మనీ… సెక్స్ రాకెట్ వ్యవహారాల గురించి మాత్రం గుర్తుంచుకోలేకపోయారు. అంటే.. నేరస్తుడ్ని అయిన పార్టీలో చేర్చుకుని ఉండాలి లేకపోతే… తాము.. తమ పత్రిక చేసిన ఆరోపణలు తప్పయినా ఉండాలి. ఏది జరిగినా.. వైసీపీకి విలువలు లేవనే మాట మాత్రం స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close