యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కూడా చేశారు. ఏప్రిల్ 5న నిశ్చితార్థం జరగబోతోంది. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సయ్యింది. ఏప్రిల్ 29న తిరుపతిలో నిడారంబరంగా పెళ్లి చేసుకోబోతున్నారు. మే1న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి సింపుల్ గా చేసుకోవాలని ఇరు కుటుంబాలూ భావించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
కావ్యారెడ్డితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు బెల్లంకొండ. ఇరు కుటుంబాలూ పెళ్లికి ‘ఓకే’ చెప్పడంతో మార్గం సుగమం అయ్యింది. ఏప్రిల్ 5న హైదరాబాద్ లో జరిగే నిశ్చితార్థ వేడుకకు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని ఓ హోటెల్ లో నిశ్చతార్థ వేడుక నిర్వహిస్తారు. వేదిక ఏమిటన్నది రెండ్రోజుల్లో తెలుస్తుంది.
‘అల్లుడు శ్రీను’ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు బెల్లంకొండ. ఇటీవల ‘కిష్కిందపురి’తో మంచి హిట్టు కొట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.
