సీపీఎం, టీఎంసీలను ఒకే కూటమిలో చంద్రబాబు ఉంచగలరా..?

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు విస్తృతంగా శ్రమిస్తున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలే. కానీ కొన్ని పార్టీలు.. జాతీయ పార్టీల్లాంటివి. అవి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూంటాయి. కానీ ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటున్నాయి. ఇలాంటి పార్టీలను కలపడం… టీడీపీ అధినేతకు అత్యంత సవాల్‌తో కూడిన అంశంగా మారనుంది. ఇలాంటి సవాల్ మొదటిసారిగా చంద్రబాబు బెంగాల్ విషయంలో ఎదుర్కోబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ నెల 19 తేదిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారు. 22వ తేదిన ఢిల్లీలో జరగనున్న బిజెపీయేతర కూటమి పక్షాల సమావేశానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు మమతను కోరనున్నారు.

నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయాలనే సలహాను…మమతా బెనర్జీనే మొదట చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతు పలుకుతున్నారు కూడా. జనవరిలో కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీని ఆమె…బీజేపీయేతర కూటమి బలప్రదర్శనగా మార్చాలనుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. కూటమిలో బాగస్వామ్య పక్షంగా ఉండనున్న సిపిఎంకు .. తృణమూల్ కాంగ్రెస్ కు బద్ద వైరం ఉంది. ఇటువంటి భిన్న స్వభావాలు కలిగిన వారిని కూటమిలోకి తీసుకువస్తే వీరు కలిసి ఉండటం కష్టమవుతుందని భావన ఉంది. వీరిరువురిని అనుసంధానం చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. బెంగాల్‌లో బీజేపీ వేగంగా ఎదుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నందున.. కలసి కట్టుగా పోరాడటంలో తప్పు లేదన్న ఆ రెండు పార్టీలకు సర్ది చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయవచ్చు.

22వ తేదిన ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి, ఇటు చంద్రబాబు వైపు నుంచి నేతలందరికీ ఫోన్ లు వెలుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీ దాడులపై రాష్ట్రపతి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఎటువంటి స్పందన రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close