తమిళ రాజకీయలపై మద్రాస్ హైకోర్ట్ నిర్ణయం నేడే!

ఇటు బలపరీక్ష జరపాలని స్టాలిన్ పిటిషన్, అటు తమపై వేటు చట్ట విరుద్దం అని దినకరన్ పిటిషన్.ఇంతలోనే చెన్నై చేరుకున్న గవర్నర్. గవర్నర్ ని కలవడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించిన పళని స్వామి. అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్. ఇదీ చెన్నై రాజకీయ చదరంగం లో ఇవాళ్టి పరిస్థితి. మొత్తానికి ఇవాళ కోర్ట్ ఏ తరహా తీర్పు, ఎటువంటి నిర్ణయం వెలువరుస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆర్నెల్ల క్రితం చావు తప్పి కన్నులొట్టబోయినట్లు అసెంబ్లీ బలపరీక్ష పాసయిన పళని స్వామి ప్రభుత్వం, ఆ తర్వాత పన్నీర్ సెల్వం తో కలిసిపోయి, దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు 18 మంది ని సస్పెండ్ చేసి దినకరన్ కి షాకిచ్చిన విషయం తెలిసిందే. సస్పెండైన దినకరన్ వర్గ ఎమ్మెల్యేలని రిసార్ట్ లో ఉంచి, దినకరన్ కోర్ట్ లో కేస్ వేసాడు. ఇటు స్టాలిన్ కూడా బలపరీక్ష కోసం గవర్నర్ ని కలిస్తే గవర్నర్ ఏ విషయమూ తేల్చకపోవడం తో కోర్టుకి వెళ్ళాడు.

అయితే కోర్ట్ స్టాలిన్ పిటిషన్ మేరకు బలపరీక్ష కి ఆదేశించినా , ఇప్పటికిప్పుడు పళని ప్రభుత్వానికి వచ్చిన ఇప్పంది ఏమీ లెడు కానీ దినకరన్ కి అనుకూలంగా నిర్ణయం వస్తే మాత్రం పళని కి చిక్కులు తప్పవు. కానీ అలా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఈ తీర్పు సందర్భంగా కోర్ట్ ఈ తమిళ రాజకీయ చదరంగం పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందనేది కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close