పరీక్షలే..! హైకోర్టు ఆదేశాల తర్వాత సీఎం స్పందన ఇదే..!

పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని గట్టిగా సూచిస్తే.. మే మూడో తేదీలోపు ఏ విషయం చెప్పాలని..ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలిచ్చిన కాసేపటికే.. అధికారికంగా విద్యా శాఖపై సమీక్ష చేసిన సీఎం జగన్.. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని సంకేతాలు పంపారు. దీంతో .. హైకోర్టు సూచనలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదనే దానికి బలమైన సంకేతాలు వచ్చినట్లయింది. విద్యార్థుల భవిష్యత్ కోసమే.. టెన్త్, ఇంటర్ పరీక్షల్ని నిర్వహిస్తున్నామని… ఏ పరిస్థితిలో, ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది ప్రజలకు చెప్పాలని ఆయన అధికారులు.. మంత్రులను ఆదేశించారు. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని.. అలా ఇస్తే విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు.

కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని గుర్తు చేశారు. పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని.. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయన్నారు. ఏపీలో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి…మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏంటి అని జగన్ ప్రశ్నించారు.

విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్‌ గుర్తించాలని.. అన్ని కోవిడ్‌ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో… ఎప్పటిలాగే… హైకోర్టు ఆదేశాలను కన్నా… తన సొంత పట్టుదలనే ప్రామాణికంగా తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మూడో తేదీన పరీక్షలు పెడతామనే హైకోర్టుకు తెలిపే అవకాశం ఉంది. హైకోర్టు స్పందన కీలకంగా మారనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close