తెలుగు రాష్ట్రాలకు వచ్చేసిన కొత్త స్ట్రెయిన్ ..!

కరోనా కొత్త వేరియంట్… తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది. యూకే నుంచి వచ్చిన వారందర్నీ ట్రేస్ చేసి.. టెస్టులు చేసిన తర్వాత వరంగల్‌లో ఒకరికి.. నెల్లూరుల జిల్లాలో మరొకరికి నిర్దారణ అయినట్లుగా అధికారులు ప్రకటించారు. వారి కాంటాక్టులందర్నీ గుర్తించి.. ఐసోలేషన్‌కు పంపే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. కానీ..యూకే నుంచి వచ్చిన వారు ఇప్పటికే జనంలో కలిసిపోయారు. వారి ద్వారా ఇతరులకు వ్యాపించి ఉంటుందన్న ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మామూలు కరోనా కన్నా.. కొత్త స్ట్రెయిన్ దాదాపుగా 70 శాతం ఎక్కువగా ఇతరులకు వ్యాపిస్తుందని తేలింది. దీంతో అధికారులు హైరానా పడుతున్నారు.

కొత్త రకం స్ట్రెయిన్ కరోనాపై.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆందోళన చెందుతోంది. బ్రిటన్‌లో మొదటగా ఇది బయటపడింది. దీంతో ఆ దేశానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. ఇప్పటికే.. ఆ దేశం నుంచి వచ్చిన వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు. వారందర్నీ ట్రేస్ చేయడానికి అధికార యంత్రాంగం అంతా తంటాలు పడుతోంది. చాలా మంది పాస్‌పోర్టు ఉన్న చిరునామాల్లో ఉండటం లేదు. దాంతో వారందర్నీ పట్టుకోవడం కష్టంగా మారింది. వారి ద్వారా.. కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తుందన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది.

కరోనా వైరస్ ఏపీలోకి వచ్చినప్పుడు మొదటి కేసు నెల్లూరులోనే బయటపడింది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ కూడా… నెల్లూరులోనే బయట పడింది. దీంతో నెల్లూరు ప్రజలు హడలి పోతున్నారు. కరోనా పరిస్థితులు దేశంలోకి ప్రవేశించినప్పుడు.. ఎలాంటి భయాందోళనల పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు కూడా.. అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ప్రజల్లో ఓ రకమైన భయం కనిపిస్తోంది. మల్లీ లాక్ డౌన్ వేస్తారన్న ఆందోళన కూడా… అందరిలోనూ ప్రారంభమయింది. ఇతర దేశాల్లో బయట జన సంచారంపై ప్రభుత్వాలు…. ఆంక్షలు విధిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close