“పీడీ” అకౌంట్లు ఉంటే అవినీతి జరిగినట్లేనా..?

భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించి ” పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్‌”లో భారీగా నిధులున్నాయని.. అంటే పెద్ద స్కామ్ జరిగిపోయినట్లేనని ఆరోపించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. జీవీఎల్ వేల కోట్ల లెక్క చెబుతూండటంతో… దీనిపై ప్రజల్లోనూ ఆసక్తి పెరిగిపోయింది. అసలు ఈ పీడీ అకౌంట్లేమిటన్నదాని చర్చ ప్రారంభించింది. ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల వ్యవస్థలో ఓ సంస్కణ ఈ “పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్” . 2005లో వీటిని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, స్థానిక సంస్థలు, సివిల్ కోర్టులు వంటి వాటితో పాటు.. ఎప్పటికప్పుడు ప్రజావసరాల కోసం… చేయాల్సిన ఖర్చులను మంజూరు చేసే అధికారం ఉన్న ఓ స్థాయి అధికారులు వీటిని ప్రారంభించారు. అవసరాలను బట్టి ప్రభుత్వం వీరికి నిధుల కేటాయింపు జరుగుతుంది.

అయితే ఈ పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లు.. ఆయా అధికారుల పేర్ల మీదే ఉంటాయి. కానీ నిర్వహణ మాత్రం ఏ జిల్లాలకు ఆ జిల్లాల ట్రెజరీ కార్యాలయాలే నిర్వహిస్తాయి. అసలు పారదర్శకంగా ఖర్చులు ఉండటానికి ఈ పర్సనల్ డిపాజిట్ అకౌంట్లను.. అన్ని రాష్ట్రాల్లోనూ ఓపెన్ చేశారు. అత్యధిక మొత్తం పీడీ అకౌంట్లలో డబ్బులున్నాయని జీవీఎల్ మరో ఆరోపణ చేశారు. అలా ఉండటమే అవినీతి అన్నట్లుగా చెప్పుకొచ్చారు. నిజానికి పీడీ అకౌంట్లతో అత్యధికంగా నిధులు ఉన్నది.. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే. రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన పీడీ అకౌంట్లలో రూ. 34,613 కోట్లు ఉన్నాయి. అదే మహారాష్ట్రలో రూ. 21,605 కోట్లు ఉన్నాయి. తెలగాణలో రూ. 10,873 కోట్లు ఉన్నాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు… ఆక్కడి ప్రభుత్వాల ఖర్చులకు అనుగుణంగా.. పీడీ అకౌంట్లలో నిధులు ఉంటాయి. అదంతా పాలనా పరమైన ప్రక్రియ. ఈ పీడీ అకౌంట్ల నుంచి నిధులు డ్రా చేయడం కూడా చాలా పెద్ద పని. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం తీయ‌డానికి ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉండాలి.

ఈ పీడీ అకౌంట్లలో నిధులు ఉండటమే పెద్ద అవినీతి అన్నట్లుగా జీవీఎల్‌ నరసింహారావు చెప్పుకొస్తున్నారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పీడీ అకౌంట్లలో ఉన్న నిధులు కూడా.. అవినీతికి సంబంధించినవేనా.. అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. పీడీ అకౌంట్లకు సంబంధించి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవివరంగా సమాధానం చెప్పారు. రాజ్యసభ సభ్యుడికి.. కనీస పరిజ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. కానీ జీవీఎల్ ఆయనను స్టాక్ మార్కెట్ బ్రోకర్‌గానే పరిగణిస్తున్నారు. ఆయన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అన్న విషయాన్ని గుర్తించడానికి ఇష్టపడటం లేదు. తనకు ముఖ్యమంత్రి మాత్రమే సమాధానం చెప్పాలంటున్నారు.

ఏదో అవినీతి జరిగిందే విషయాల్లో అర్థం కాని సాంకేతిక పదాలతో ప్రజల్లోకి తీసుకెళ్తే.. చాలు.. టూజీ స్కాంలా ఏమీ లేకపోయినా.. ప్రభుత్వంపై మచ్చ పడిపోతుందని.. జీవీఎల్ ఆశ పడుతున్నట్లు ఉన్నారు. అందుకే పథకం ప్రకారం బురద జల్లుతున్నారు. రొటీన్ గా జరిగే వ్యవహారాల్లోనూ… అవినీతి అవినీతి అంటూ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి విభజన హామీల విషయంలో కేంద్రంపై టీడీపీ చేస్తున్న ఒత్తిడికి ఇలా అవినీతి ఆరోపణలతో కౌంటర్ ఇవ్వాలని జీవీఎల్ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close