వైసీపీలో అవినాష్‌కు పొగపెట్టడానికే వంగవీటితో ఆరోపణలు చేయించారా !?

వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ చేసిందెవరు ?. ఈ అంశం ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు… స్వయంగా మంత్రి హోదాలో ఉన్న ఒకరిని పక్కన పెట్టుకుని వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేయడం సహజంగానే కలకలంరేపుతోంది. అంతగా రెక్కీ నిర్వహిస్తే ఆ నిందితుల్ని పట్టుకోకుండా రాజకీయ ఆరోపణలు ఎందుకు చేస్తారనేది కీలకం. ఈ మొత్తం వ్యవహారం వెనుక వైసీపీ అంతర్గత రాజకీయాలు ఉన్నాయని తెలుస్తోంది. దేవినేని అవినాష్‌కు వైసీపీ నుంచి పొగ పెట్టేలా కొడాలి నాని, వంశీ … వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఈ వ్యూహం పన్నారని భావిస్తున్నారు.

అలా వంగవీటి ఆరోపణలు చేసిన తర్వాత ఇలా గుణదల గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గుణదల గ్యాంగ్ అంటే దేవినేని అవినాష్ గ్యాంగ్. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఓ సారి ఆయన ఇంటి ముందే హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఆయన ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ రెండింటినీ అవినాష్ గ్యాంగే చేసింది. ఆ దాడులు జరిగినప్పుడే వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ జరిగిందని ప్రచారంచేస్తున్నారు. అంటే.. దేవినేని వర్గమే మళ్లీ దాడులకు పాల్పడుతోందని చెప్పాలనుకుంటున్నారు. ఈ అంశాన్ని్ మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

విజయవాడలో దాడులకు పాల్పడుతున్న ముఠా ప్రస్తుతానికి దేవినేని అవినాష్ వర్గమే. కావాలని కాకపోయినా.. తమ పార్టీ రాజకీయ అవసరాలకు అవినాష్‌ను .. ఆయన అనుచరుల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు అదేకారణం చూపించి ఆయనను బలి పశువును చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. ఈ అంశంపై దేవినేని అవినాష్ వర్గం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. మొత్తంగా చూస్తే ఇక ముందు దేవినేని అవినాష్‌కు వైసీపీలో గడ్డు కాలం ప్రారంభమైనట్లేనని అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close