మండలి కార్యదర్శిని కాపాడేందుకు రంగంలోకి ఉద్యోగ సంఘాలు..!

శాసనమండలి చైర్మన్, కార్యదర్శికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌లోకి ఉద్యోగ సంఘాలు ఎంటరయ్యాయి. అదేదో ఇద్దరి మధ్య సమరం అన్నట్లుగా.. మండలి చైర్మన్ పై మండి పడుతూ… సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు తెర ముందుకు వచ్చారు. చీఫ్ సెక్రటరీని కలిసి బయటకు వచ్చి రాజకీయ ప్రకటనలు చేశారు. రూల్స్‌కు విరుద్దంగా వెళ్లమని ప్రతిపక్షం అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని .. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఘాటుగా .. తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రూల్స్ లేవు..తొక్కా లేదంటూ యనమల, బోండా ఉమను జైల్లో వేయమని హోంమంత్రి చెబితే ప్రతిపక్షం ఏమంటుందని.. అచ్చంగా వైసీపీ నాయకుడిగా ఓ స్టేట్మెంట్ పడేశారు.

హోంమంత్రి చెప్పారని పోలీసులు వారిని జైల్లో పెడితే ప్రతిపక్షం సమర్థిస్తుందా అనే లాజిక్ కూడా.. ప్రయోగించారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత తీరు చూసి.. మీడియా కూడా ఆశ్చర్యపోయింది. ఎవరైనా ఉద్యోగికి అన్యాయం జరిగితే.. అప్పుడు మాట్లాడినా ఓ అర్థం ఉంటుంది. కానీ.. మండలి చైర్మన్.. మండలి కార్యదర్శి తన విధులను.. సరిగ్గా నిర్వహించడం లేదని రాజ్యాంగ వ్యతిరేకంగా… తన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని.. ఫిర్యాదు చేసినందుకే… ఉద్యోగ సంఘాల పేరుతో.. వెంకట్రామిరెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఇంత వరకూ వైసీపీ నేత కూడా మాట్లాడనట్లుగా మాట్లాడారు.

ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేయమని ఆదేశించడానికి హోంమంత్రికైనా… ఎవరికైనా అధికారం ఉండదని.. చివరికి ఆ ఉద్యోగులు కూడా… నిబంధనల ప్రకారమే పని చేయాలన్న విషయాన్ని ఉద్యోగ సంఘం నేతలు మర్చిపోయారు. పాలక పార్టీ చల్లని చూపు కోసం.. ఉద్యోగ సంఘాల నేతలు పాకులాడటంలో.. రాజకీయ పార్టీలపైనా విమర్శలకు దిగుతూండటం.. కొత్త పరిణామంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close