ఇక తగ్గేదేలే.. స్వరం పెంచిన ఉద్యోగ సంఘాలు !

నిన్నామొన్నటి వరకూ ప్రభుత్వ నిర్బంధాలపై భయంతోనో.. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సఖ్యత కారణంగా మోహమాటంగానో మాట్లాడిన ఉద్యోగసంఘాల నేతలు ఈ రోజు ప్రతి ఒక్క ఉద్యోగి మద్దతుగా ఉన్నాడని క్లారిటీ రావడంతో స్వరం పెంచారు. పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏడో తేదీ నుంచి సమ్మె చేస్తామని ముందుగానే ప్రకటించారు.. అంతకు రెండు రోజుల ముందు నుంచి అంటే ఐదో తేదీ నుంచి సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించారు. అంటే ఉద్యోగులు విధులకు హాజరవుతారు కానీ పనులు చేయరు.

రేపు ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నడుస్తాయి. ఎల్లుండి నుంచి ఇక అన్ని కార్యకలాపాలను బంద్ చేస్తారు. చర్చలు తప్ప మరే దిక్కు లేదంటున్న ప్రభుత్వానికి తాము సమ్మె చేస్తే ఎలా ఊపిరి ఆడుతుందో చూపిస్తామని అంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ కూడా కలిసి వస్తూండటం ప్రభుత్వానికి ఉక్కపోత కలిగించేదే. బస్సులు ఆగిపోతే.. ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఉద్యోగుల మీద కన్నా ప్రభుత్వం మీదనే ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేస్తారు . ఆ విషయం పాలక పార్టీకి తెలియనిదేం కాదు.

అందుకే సమ్మె దాకా వెళ్లకుండా ఏం చేయాలన్నదానిపై సజ్జలతో జగన్మోహన్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో సీఎస్ సమీర్ శర్మ కూడా తన సూచనలు ఇస్తున్నారు. ప్రభుత్వం జీవోలను వెనక్కి తీసుకోవాలా లేకపోతే.. ఇదే కఠిన వైఖరి అవలంభించాలా అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. ఇది ప్రభుత్వానికి ఎటూ తేలని సమస్య అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close